హైదరాబాద్ వాసులకు మరో హెచ్చరిక
- July 21, 2023
హైదరాబాద్: హైదరాబాద్ నగరవాసులకు మరో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. మరో రెండు , మూడు గంటల్లో భారీ వర్షం పడనున్నట్లు ప్రకటించింది. గత నాల్గు రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యముగా హైదరాబాద్ లో వర్షం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా దంచికొడుతుండడం తో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారగా, ఉస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది.
ఇదిలా ఉండగానే మరో రెండు , మూడు గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం మెచ్చరిస్తోంది. అలాగే ఈరోజు , రేపు ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ సెలవు ప్రకటించింది. ప్రైవేటు కార్యాలయాలూ సెలవులు ప్రకటించేలా కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!









