ట్విట్టర్ లోగో మార్పు..! కొత్త లోగో 'X'
- July 24, 2023ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ అనగానే అందరికీ నీలి రంగులో ఉండే పక్షి సింబల్ గర్తుకు వస్తుంది. ఈ లోగో చాలా పాపులర్ అయింది. అయితే గతేడాది ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లు వెచ్చింది కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు దీన్ని మార్చాలని డిసైడ్ అయ్యారు. ట్విట్టర్ పిట్ట స్థానంలో ఎక్స్ అక్షరాన్ని లోగోగా తీసుకొస్తున్నారు. అతి త్వరలోనే ఈ కొత్త లోగో అధికారికంగా నీలం రంగు పక్షి సింబల్ ను రీప్లేస్ చేస్తుంది.
ట్విట్టర్ ను ఇకపై ఎక్స్ అని పిలవబోతున్నట్లు కంపెనీ సీఈఓ లిండా యాక్సినే ఇప్పటికే స్పష్టం చేశారు. ఏఐ ఆధారిత మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాంలో ఆడియా, వీడియో, మెసేజ్ లతో పాటు పేమెంట్లు, బ్యాంకింగ్ సేవలు ఉండనున్నట్లు వెల్లడించారు.
సోషల్ మీడియాలో ట్విటర్ భారీ మార్పు తీసుకొచ్చిందని, కమ్యూనికేషన్ విధానం మారిందని లిండా చెప్పుకొచ్చారు. ఇకపై ఎక్స్ పేరుతో మరింత ట్రాన్స్ ఫార్మ్ కానున్నట్లు తెలిపారు.
ఆదివారం ఎక్స్ అక్షరంతో ఉన్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు ఎలాన్ మస్క్. కొంత మంది దీనిపై స్పందిస్తూ ట్విట్టర్ లోగో మారబోతుందా అని అడగగా.. అవును అని బదులిచ్చారు. దీంతో లోగో మార్పు అధికారికంగా ప్రకటింనట్లు అయింది.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశాక అనూహ్య మార్పులు చేసి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్ లో ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను తీసుకొచ్చారు బ్లూ టిక్ కావాలంటే డబ్బులు చెల్లించాలనే కండీషన్ పెట్టారు. ఎక్కువ మంది సబ్ స్క్రిప్షన్లు తీసుకోవాలనే ఉద్దేశంతో ట్విట్టర్ ఫీచర్లను కూడా లాక్ చేశారు. ఇప్పుడు ఎక్స్ పేరుతో ఇందులో ఏఐ ఫీచర్లు కూడా తీసుకొచ్చి మరింత మంది సబ్ స్క్రిప్షన్ తీసుకునేలా చేయాలనే ప్లాన్ తో మస్క్ ముందుకు వెళ్తున్నారు.
కాగా మస్క్ ట్విట్టర్ ను కొనగోలు చేశాక బ్రాండ్లు, ప్రభుత్వ రంగ ఖాతాలకు గోల్డ్, సిల్వర్ బ్యాడ్జ్ లను కూడా ప్రవేశ పెట్టారు. ఖాతాల వెరిఫికేషన్ కోసం డబ్బులు చెల్లించాలనే రూల్ పెట్టారు. ట్విట్టర్ లో వేల మంది సబ్బందిని తొలగించారు. గతంలో బ్యాన్ చేసిన పలు ఖాతాలను తిరిగి రీ యాక్టివేట్ చేశారు. మస్క్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ట్విట్టర్ ఆదాయం 50 శాతం తగ్గింది. అయినా తన పంథాలోనే ముందుకు సాగుతు లోగోను మార్చుతున్నారు. వైట్ కలర్ లో ఉండే ట్విట్టర్ పేజీని కూడా బ్లాక్ రంగులోకి మార్చనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం X.COM వెబ్ సైట్లోకి లాగాన్ అయితే ట్విట్టర్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. మున్ముందు ఇదే అధికారిక వైబ్ సైట్ అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
మరోవైపు ట్విట్టర్ కు పోటీగా మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ఇన్ స్టాగ్రాం నుంచి థ్రెడ్స్ ప్లాట్ ఫారంను తీసుకొచ్చారు. ఇది అచ్చం ట్విట్టర్ ను పోలి ఉంది. ఇప్పటికే 15 కోట్ల మందికిగై యూజర్లు సైనప్ చేశారు. ఇన్ స్టా గ్రాం నుంచి వచ్చిన ఈ యాప్ ట్విట్టర్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు