పెరిగిన పసిడి ధర

- May 16, 2016 , by Maagulf
పెరిగిన పసిడి ధర

పసిడి ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. రూ.25 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.30,050కి చేరింది. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు స్థిరంగా జరగకపోయినా ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.39 శాతం పెరిగి 1,277.80 యూఎస్‌ డాలర్లకు చేరింది.
సోమవారం వెండి ధర సైతం పెరిగింది. రూ.41,000 మార్కును దాటేసింది. రూ.335 పెరగడంతో కేజీ వెండి ధర రూ.41,260కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com