తిరుమలలో ఉగ్ర జెండాలు
- May 16, 2016
తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ భారత దేశంలో ఎంతో పుణ్యక్షేత్రంమైన తిరుపతిలో ఇప్పుడు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ జెండాలు వెలిశాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలను వణుకి పుట్టిస్తున్న ఉగ్రవాద సంస్థ కన్ను తిరుపతి పై పడిందా అని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే భారత దేశంలో ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్న ఉగ్రవాద సంస్థలు పుణ్యక్షేత్రాలపై కన్నేయడం ఒకింత భయాందోళన కలిగించే విషయమే. తిరుమలలోని జాపాలీ తీర్థానికి వెళ్లే రహదారిలో ఈ జెండా కనిపించడం షాక్కు గురి చేసింది.ఈ జెండాతో పాటు ఓ సామాజిక వర్గానికి చెందిన జెండాలు కూడా అక్కడ కనిపించాయి. ఇప్పటికే ఇంటిలీజెన్స్ వారు ఉగ్ర వాదుల నుంచి ముప్పు ఉందని ఇప్పటికే పలు మార్లు అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేశారు. ఈ సంవత్సరం మొదలు పంజాబ్ లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తిరుపతిలో ఐఎస్ఐఎస్ జెండా దర్శనమివ్వడంతో భక్తులు షాక్ తిన్నారు. దీంతో వెంటనే పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆ జెండాలను తొలగించారు. ఐతే వాటిని అక్కడ పెట్టింది ఎవరన్నది తేలాల్సి ఉంది. కాగా అసలు ఈ జెండాలను పవిత్ర తిరుమల క్షేత్రం పైకి ఎందుకు తెచ్చారన్నది ప్రశ్నగా మారింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







