ఈనెల 22 న మొదలుకానున్న 'ధృవ'
- May 17, 2016
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'తనీ ఒరువన్' రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ ఈనెల 22నుంచి హైదరాబాద్లో జరగనుంది. ఈ సినిమాకి కీలకం కానున్న యాక్షన్ సీక్వెన్స్ ఈ షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రంకోసం రామ్ చరణ్ తేజ్ లుక్ను పూర్తిగా మార్చేశాడట సురేందర్ రెడ్డి. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత జూన్ 20నుంచి కశ్మీర్లో జరగనున్న షూటింగ్లో చిత్రంలోని కీలకపాత్రధారాలు నటించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోంది. కీలకపాత్ర పోషిస్తున్న అరవింద్ స్వామి నటన ఈచిత్రానికే హైలెట్ కానుందట. తమిళంలో ఘన విజయం సాధించి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం తెలుగు రీమేక్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఒరిజినల్ వెర్షన్కు మ్యూజిక్ అందించిన హిప్ హప్ అది ఈ సినిమాకూ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రానికి తెలుగులో 'ధృవ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!









