ఈనెల 22 న మొదలుకానున్న 'ధృవ'
- May 17, 2016
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'తనీ ఒరువన్' రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ ఈనెల 22నుంచి హైదరాబాద్లో జరగనుంది. ఈ సినిమాకి కీలకం కానున్న యాక్షన్ సీక్వెన్స్ ఈ షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రంకోసం రామ్ చరణ్ తేజ్ లుక్ను పూర్తిగా మార్చేశాడట సురేందర్ రెడ్డి. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత జూన్ 20నుంచి కశ్మీర్లో జరగనున్న షూటింగ్లో చిత్రంలోని కీలకపాత్రధారాలు నటించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోంది. కీలకపాత్ర పోషిస్తున్న అరవింద్ స్వామి నటన ఈచిత్రానికే హైలెట్ కానుందట. తమిళంలో ఘన విజయం సాధించి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం తెలుగు రీమేక్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఒరిజినల్ వెర్షన్కు మ్యూజిక్ అందించిన హిప్ హప్ అది ఈ సినిమాకూ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రానికి తెలుగులో 'ధృవ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







