సినీ నటుడు తనీష్ తండ్రి కన్నుమూశారు..
- May 17, 2016
వర్ధమాన సినీ నటుడు తనీష్ తండ్రి వర్ధన్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం వేకువజామున కన్నుమూశారు. మణికొండలోని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వర్ధన్ 6వ అంతస్తు నుంచి మంగళవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నేటి వేకువజామున ఆయన మృతిచెందారు.
ప్రమాదవశాత్తూ వర్ధన్ మృతిచెందడంతో తనీష్, ఆయన కుటుంబసభ్యులు తీవ్ర దుఖంలో ఉన్నారు. దేవుళ్లు, మన్మధుడు సినిమాలలో బాలనటుడిగా నటించిన తనీష్ నచ్చావులే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచమమైన విషయం తెలిసిందే. వర్ధన్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రమాదవశాత్తూ జారి పడలేదని ఆత్మహత్యాయత్నం చేశారని భిన్న కథనాలు వినిసిస్తున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







