ఆర్థిక సహకారం చర్చించిన బహ్రెయిన్, ఇండియా
- August 23, 2023
బహ్రెయిన్: పారిశ్రామిక మరియు వాణిజ్య మంత్రి అబ్దుల్లా బిన్ అడెల్ ఫఖ్రో ఆర్థిక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి చారిత్రక బహ్రెయిన్-భారత సంబంధాలలో పెట్టుబడి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. బహ్రెయిన్ రాజ్యానికి నియమించబడిన భారత రాయబారి వినోద్ కె. జాకబ్ను ఫఖ్రోను స్వీకరించారు. ఈ సందర్భంగా భారత-బహ్రెయిన్ వాణిజ్య సంబంధాలపై స్పష్టతనిచ్చారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాలలో ముఖ్యంగా ఆర్థిక మరియు పెట్టుబడులలో సహకారాన్ని పెంపొందించే మార్గాలను సమీక్షించారు. రాయబారి తన దౌత్య విధులను విజయవంతం చేయాలని మంత్రి ఆకాంక్షించారు. భారతదేశంతో సహకారాన్ని పెంపొందించుకోవడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తిగా ఉందన్నారు. భారత రాయబారి ద్వైపాక్షిక సంబంధాలను, ఇరుపక్షాల మధ్య పెట్టుబడుల ప్రవాహాన్ని అభివృద్ధి చేయడానికి బహ్రెయిన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







