పర్యాటక గమ్యస్థానంగా ఒమన్
- August 30, 2023
మస్కట్: హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ మంగళవారం క్రౌన్ ప్లాజా మస్కట్ OCECలో రిజర్వేషన్ల కోసం గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (GDS)పై వర్క్షాప్ను నిర్వహించింది. వర్క్షాప్ను హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అజాన్ ఖాసిం అలీ బుసైదీ ప్రారంభించారు. వర్క్షాప్ ఒమానీ హోటళ్లలో బుకింగ్లను పెంచడం ద్వారా ఒమన్ సుల్తానేట్లోని పర్యాటక పరిశ్రమను కొత్త దిశగా నడిపించడం, పర్యాటక సంస్థలను వారి సౌకర్యాలకు పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షించడంలో ఈ వ్యవస్థలను ఉపయోగించుకునేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. GDS వ్యవస్థలు కేంద్ర బుకింగ్ ప్లాట్ఫారమ్లు, ఇవి వివిధ దేశాల నుండి ట్రావెల్ ఏజెంట్లకు విమాన, హోటల్ ధరలు, కారు అద్దెలు ఇతర ముఖ్యమైన ప్రయాణీకుల పర్యాటక సేవలను అందిస్తాయని తెలిపారు. ఈ వ్యవస్థలు ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్లు (హోటల్లు), రిజర్వేషన్ సోర్స్లు (ట్రావెల్ ఏజెంట్లు) మధ్య కీలకమైన లింక్గా పనిచేస్తాయని, ఇవి బుకింగ్లను సమర్ధవంతంగా నిర్వహించడానికి, ప్రపంచ స్థాయిలో తమ ఆఫర్లను పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తాయని పేర్కొన్నారు.ఈ వర్క్షాప్ దేశంలోని హోటల్ రంగానికి సంపన్నమైన భవిష్యత్తును నిర్ధారిస్తూ, ఒమన్ సుల్తానేట్ను పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించే లక్ష్యంతో అనేక కార్యక్రమాల అమలులో భాగం అన్నారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







