పర్యాటక గమ్యస్థానంగా ఒమన్
- August 30, 2023
మస్కట్: హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ మంగళవారం క్రౌన్ ప్లాజా మస్కట్ OCECలో రిజర్వేషన్ల కోసం గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (GDS)పై వర్క్షాప్ను నిర్వహించింది. వర్క్షాప్ను హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అజాన్ ఖాసిం అలీ బుసైదీ ప్రారంభించారు. వర్క్షాప్ ఒమానీ హోటళ్లలో బుకింగ్లను పెంచడం ద్వారా ఒమన్ సుల్తానేట్లోని పర్యాటక పరిశ్రమను కొత్త దిశగా నడిపించడం, పర్యాటక సంస్థలను వారి సౌకర్యాలకు పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షించడంలో ఈ వ్యవస్థలను ఉపయోగించుకునేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. GDS వ్యవస్థలు కేంద్ర బుకింగ్ ప్లాట్ఫారమ్లు, ఇవి వివిధ దేశాల నుండి ట్రావెల్ ఏజెంట్లకు విమాన, హోటల్ ధరలు, కారు అద్దెలు ఇతర ముఖ్యమైన ప్రయాణీకుల పర్యాటక సేవలను అందిస్తాయని తెలిపారు. ఈ వ్యవస్థలు ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్లు (హోటల్లు), రిజర్వేషన్ సోర్స్లు (ట్రావెల్ ఏజెంట్లు) మధ్య కీలకమైన లింక్గా పనిచేస్తాయని, ఇవి బుకింగ్లను సమర్ధవంతంగా నిర్వహించడానికి, ప్రపంచ స్థాయిలో తమ ఆఫర్లను పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తాయని పేర్కొన్నారు.ఈ వర్క్షాప్ దేశంలోని హోటల్ రంగానికి సంపన్నమైన భవిష్యత్తును నిర్ధారిస్తూ, ఒమన్ సుల్తానేట్ను పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించే లక్ష్యంతో అనేక కార్యక్రమాల అమలులో భాగం అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







