పర్యాటక గమ్యస్థానంగా ఒమన్
- August 30, 2023
మస్కట్: హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ మంగళవారం క్రౌన్ ప్లాజా మస్కట్ OCECలో రిజర్వేషన్ల కోసం గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (GDS)పై వర్క్షాప్ను నిర్వహించింది. వర్క్షాప్ను హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అజాన్ ఖాసిం అలీ బుసైదీ ప్రారంభించారు. వర్క్షాప్ ఒమానీ హోటళ్లలో బుకింగ్లను పెంచడం ద్వారా ఒమన్ సుల్తానేట్లోని పర్యాటక పరిశ్రమను కొత్త దిశగా నడిపించడం, పర్యాటక సంస్థలను వారి సౌకర్యాలకు పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షించడంలో ఈ వ్యవస్థలను ఉపయోగించుకునేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. GDS వ్యవస్థలు కేంద్ర బుకింగ్ ప్లాట్ఫారమ్లు, ఇవి వివిధ దేశాల నుండి ట్రావెల్ ఏజెంట్లకు విమాన, హోటల్ ధరలు, కారు అద్దెలు ఇతర ముఖ్యమైన ప్రయాణీకుల పర్యాటక సేవలను అందిస్తాయని తెలిపారు. ఈ వ్యవస్థలు ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్లు (హోటల్లు), రిజర్వేషన్ సోర్స్లు (ట్రావెల్ ఏజెంట్లు) మధ్య కీలకమైన లింక్గా పనిచేస్తాయని, ఇవి బుకింగ్లను సమర్ధవంతంగా నిర్వహించడానికి, ప్రపంచ స్థాయిలో తమ ఆఫర్లను పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తాయని పేర్కొన్నారు.ఈ వర్క్షాప్ దేశంలోని హోటల్ రంగానికి సంపన్నమైన భవిష్యత్తును నిర్ధారిస్తూ, ఒమన్ సుల్తానేట్ను పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించే లక్ష్యంతో అనేక కార్యక్రమాల అమలులో భాగం అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









