పాఠశాలలు, క్యాంపస్లో సోషల్ మీడియా, మొబైల్ వినియోగంపై నిషేధం
- August 30, 2023
యూఏఈ: దుబాయ్లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పాఠశాల అవరణలో సోషల్ మీడియా అప్లికేషన్లను ఉపయోగించడంపై పాక్షిక లేదా పూర్తి నిషేధాన్ని విధించాయి. అయితే, సోషల్ మీడియా విద్యార్థుల జీవితాల్లో ఒక భాగంగా కొనసాగుతుందని ప్రధానోపాధ్యాయులు అంగీకరిస్తున్నప్పటికీ, అలాంటి ప్లాట్ఫారమ్లను దుర్వినియోగం చేయడం వల్ల పాఠశాల నిబంధనలను ప్రమాదకర ఉల్లంఘనగా పరిగణించడం జరుగుతుందన్నారు. GEMS ఇంటర్నేషనల్ స్కూల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గదీర్ అబు-షమత్ మాట్లాడుతూ.. “పాఠశాలలో విద్యార్థులు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదు. పాఠశాల సమయంలో సోషల్ మీడియా నిషేధించబడింది. ” అన్నారాయన.
కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు తమ సోషల్ మీడియా ఛానెల్లలో పాఠశాల నుండి చిత్రాలను పోస్ట్ చేయవలసి వస్తే అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.పాఠశాల సమావేశాలలో మరియు వర్క్షాప్ల ద్వారా సామాజిక మాధ్యమాల వినియోగంపై నిరంతరం అవగాహన కల్పిస్తామని, మార్గదర్శకాలను అందిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







