ముంబైలో ప్రారంభమైన ఇండియా మూడవ మీటింగ్
- August 31, 2023
ముంబై: ఇండియా కూటమికి కన్వీనర్గా నితీశ్ కుమార్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు, రేపు విపక్షాల మూడవ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లోనే ఇండియా కన్వీనర్ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నితీశ్ కు ఐదు పార్టీల నేతల మద్దతు లభించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 11 మందితో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఐదుగురి మద్దతు ఉన్నందున నితీశ్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబైలో సాగుతోన్న విపక్షాల సమావేశానికి 28 విపక్ష పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు పాల్గొంటారని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి సమావేశం బిహార్ రాజధాని పాట్నాలో జరగ్గా, రెండవ సమావేశంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







