ముంబైలో కూలిన లిఫ్ట్…ఏడుగురి మృతి
- September 11, 2023
ముంబై: మహారాష్ట్రలో లిఫ్ట్ కూలిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. థానే నగరంలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలిపోవడంతో కనీసం ఏడుగురు కార్మికులు మరణించారు. కార్మికులు టెర్రస్పై నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. భవనం టెర్రస్పై వాటర్ఫ్రూఫింగ్ పనులు ముగించుకుని 40 అంతస్తుల నిర్మాణం నుంచి కార్మికులు దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
నిర్మాణ లిఫ్ట్లోని సపోర్టింగ్ కేబుల్స్లో ఒకటి పగిలిందని,దీనివల్ల ఈ ఘటన జరిగిందని థానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధిసతి యాసిన్ తాడ్వి తెలిపారు. ఇది నిర్మాణ లిఫ్ట్ అని, ఇది సాధారణ ఎలివేటర్ కాదని పోలీసులు చెప్పారు. ప్రత్యక్ష సాక్షులు వెంటనే స్థానిక అగ్నిమాపక శాఖ, పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ప్రస్తుతం లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







