రెండు ట్రక్కుల ఢీ: షార్జాలో డ్రైవర్ మృతి
- May 20, 2016
రెండు ట్రక్కులు ఢీకొన్న ప్రమాదంలో ఈజిప్టియన్ డ్రైవర్ ఒకరు మృతి చెందారు. అల్ ధాయిడ్ మసాఫి రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుందని షార్జా పోలీసులు వెల్లడించారు. సార్జా సెంట్రల్ రీజియన్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ బిన్ దార్విష్ మాట్లాడుతూ, యాక్సిడెంట్ గురించిన సమాచారం రాగానే వెంటనే అక్కడికి తమ బృందం చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేసిందన్నారు. ప్రమాదం తర్వాత రెండు వాహనాలకూ మంటలు అంటుకున్నాయనీ, వాటిని ఆర్పివేయగలిగామన్నారు. 31 ఏళ్ళ వయస్సున్న ఓ డ్రైవర్ ఘటన వఆస్థలంలోనే చనిపోగా, మరో ట్రక్ డ్రైవర్ గాయాల పాలయ్యాడనీ, అతన్ని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు. రోడ్డుపై సరైన వేగం పాటించడం, ఓ వాహనానికీ ఇంకో వాహనానికీ మధ్య దూరాన్ని మెయిన్టెయిన్ చెయ్యడం, రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం ప్రమాదానికి కారణమని కల్నల్ బిన్ దార్విష్ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







