అక్టోబర్ 1 నుంచి భారత్కు సర్వీసులు బంద్: సలామ్ఎయిర్
- September 21, 2023
మస్కట్: అక్టోబర్ 1 నుంచి భారత్కు కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు సలామ్ ఎయిర్ ప్రకటించింది. దీంతో భారతదేశానికి వెళ్లే వందలాది మంది ప్రయాణికుల ప్రయాణ ప్రణాళికలు గందరగోళంలో పడ్డాయి. ప్రయాణికులు బుక్ చేసుకున్న టిక్కెట్ల కోసం వారి రీఫండ్ను పొందుతారని ఈమెయిల్ లో సలామ్ ఎయిర్ ప్రకటించింది. సలామ్ఎయిర్ అనేది సుల్తానేట్ ఆఫ్ ఒమన్ నుండి తక్కువ ధర కలిగిన విమానయాన సంస్థ. ప్రస్తుతం భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాలకు ఇది సేవలు అందిస్తుంది. ఉత్తర భారతదేశంలోని జైపూర్, లక్నో, దక్షిణ భారతదేశంలోని కాలికట్, తిరువనంతపురంకు సర్వీసులను నడుపుతోంది. ఒమన్లోని వేలాది మంది ప్రవాసులకు ఇది చౌకగా ప్రయాణ సదుపాయాలను కల్పిస్తుంది. భారతదేశానికి అన్ని కార్యకలాపాలను సలామ్ఎయిర్ నిలిపివేసినట్లు తమకు కూడా సమాచారం వచ్చిందని ట్రావెల్ ఏజెన్సీలు ధృవీకరించాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..
- 17 మంది ప్రాణాలు తీసిన ఏసీ కంప్రెషర్!
- మిస్ వరల్డ్ కంటెస్టంట్లను అలరించిన సెక్రటేరియట్ డ్రోన్ షో
- కారు డోర్ లాక్–నలుగురు చిన్నారులు మృతి
- తన ఆత్మకథ పుస్తకావిష్కరణకు రావలసిందిగా రేవంత్,చంద్రబాబు కు బండారు దత్తాత్రేయ ఆహ్వానం
- త్వరలో తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్
- ఐపీఎల్ అభిమానులకు జైన్ కువైట్ బంపరాఫర్.. KD1కే స్ట్రీమింగ్ ఆఫర్..!!
- గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం.. భారతీయ దంపతులు మృతి..!!
- మస్కట్లో భారతీయుడు సహా నలుగురు శ్రీలంక ప్రవాసులు అరెస్ట్.. !!
- ట్రంప్ మిడ్ ఈస్ట్ పర్యటన: $2 ట్రిలియన్లకు పైగా బిజినెస్ ఒప్పందాలు..!!