అక్టోబర్ 1 నుంచి భారత్కు సర్వీసులు బంద్: సలామ్ఎయిర్
- September 21, 2023
మస్కట్: అక్టోబర్ 1 నుంచి భారత్కు కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు సలామ్ ఎయిర్ ప్రకటించింది. దీంతో భారతదేశానికి వెళ్లే వందలాది మంది ప్రయాణికుల ప్రయాణ ప్రణాళికలు గందరగోళంలో పడ్డాయి. ప్రయాణికులు బుక్ చేసుకున్న టిక్కెట్ల కోసం వారి రీఫండ్ను పొందుతారని ఈమెయిల్ లో సలామ్ ఎయిర్ ప్రకటించింది. సలామ్ఎయిర్ అనేది సుల్తానేట్ ఆఫ్ ఒమన్ నుండి తక్కువ ధర కలిగిన విమానయాన సంస్థ. ప్రస్తుతం భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాలకు ఇది సేవలు అందిస్తుంది. ఉత్తర భారతదేశంలోని జైపూర్, లక్నో, దక్షిణ భారతదేశంలోని కాలికట్, తిరువనంతపురంకు సర్వీసులను నడుపుతోంది. ఒమన్లోని వేలాది మంది ప్రవాసులకు ఇది చౌకగా ప్రయాణ సదుపాయాలను కల్పిస్తుంది. భారతదేశానికి అన్ని కార్యకలాపాలను సలామ్ఎయిర్ నిలిపివేసినట్లు తమకు కూడా సమాచారం వచ్చిందని ట్రావెల్ ఏజెన్సీలు ధృవీకరించాయి.
తాజా వార్తలు
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







