అక్టోబర్ 1 నుంచి భారత్కు సర్వీసులు బంద్: సలామ్ఎయిర్
- September 21, 2023
మస్కట్: అక్టోబర్ 1 నుంచి భారత్కు కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు సలామ్ ఎయిర్ ప్రకటించింది. దీంతో భారతదేశానికి వెళ్లే వందలాది మంది ప్రయాణికుల ప్రయాణ ప్రణాళికలు గందరగోళంలో పడ్డాయి. ప్రయాణికులు బుక్ చేసుకున్న టిక్కెట్ల కోసం వారి రీఫండ్ను పొందుతారని ఈమెయిల్ లో సలామ్ ఎయిర్ ప్రకటించింది. సలామ్ఎయిర్ అనేది సుల్తానేట్ ఆఫ్ ఒమన్ నుండి తక్కువ ధర కలిగిన విమానయాన సంస్థ. ప్రస్తుతం భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాలకు ఇది సేవలు అందిస్తుంది. ఉత్తర భారతదేశంలోని జైపూర్, లక్నో, దక్షిణ భారతదేశంలోని కాలికట్, తిరువనంతపురంకు సర్వీసులను నడుపుతోంది. ఒమన్లోని వేలాది మంది ప్రవాసులకు ఇది చౌకగా ప్రయాణ సదుపాయాలను కల్పిస్తుంది. భారతదేశానికి అన్ని కార్యకలాపాలను సలామ్ఎయిర్ నిలిపివేసినట్లు తమకు కూడా సమాచారం వచ్చిందని ట్రావెల్ ఏజెన్సీలు ధృవీకరించాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







