అక్టోబర్ 1 నుంచి భారత్కు సర్వీసులు బంద్: సలామ్ఎయిర్
- September 21, 2023
మస్కట్: అక్టోబర్ 1 నుంచి భారత్కు కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు సలామ్ ఎయిర్ ప్రకటించింది. దీంతో భారతదేశానికి వెళ్లే వందలాది మంది ప్రయాణికుల ప్రయాణ ప్రణాళికలు గందరగోళంలో పడ్డాయి. ప్రయాణికులు బుక్ చేసుకున్న టిక్కెట్ల కోసం వారి రీఫండ్ను పొందుతారని ఈమెయిల్ లో సలామ్ ఎయిర్ ప్రకటించింది. సలామ్ఎయిర్ అనేది సుల్తానేట్ ఆఫ్ ఒమన్ నుండి తక్కువ ధర కలిగిన విమానయాన సంస్థ. ప్రస్తుతం భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాలకు ఇది సేవలు అందిస్తుంది. ఉత్తర భారతదేశంలోని జైపూర్, లక్నో, దక్షిణ భారతదేశంలోని కాలికట్, తిరువనంతపురంకు సర్వీసులను నడుపుతోంది. ఒమన్లోని వేలాది మంది ప్రవాసులకు ఇది చౌకగా ప్రయాణ సదుపాయాలను కల్పిస్తుంది. భారతదేశానికి అన్ని కార్యకలాపాలను సలామ్ఎయిర్ నిలిపివేసినట్లు తమకు కూడా సమాచారం వచ్చిందని ట్రావెల్ ఏజెన్సీలు ధృవీకరించాయి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









