సెప్టెంబర్ లోనే 75 శాతం మంది ఉద్యోగాలు ఎందుకు మారుతారు?
- September 21, 2023
యూఏఈ: చాలా మంది యూఏఈ నివాసితులకు సెప్టెంబర్ నెలను రెండవ నూతన సంవత్సరంగా పిలుస్తారు. ఎందుకంటే వారు కొత్త ప్రారంభం.. మెరుగైన అవకాశాల కోసం ఈ సమయంలో కొత్త ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. ప్రముఖ ప్రాపర్టీ, రిక్రూట్ మెంట్ కంపెనీ Allsopp & Allsopp ప్రకారం.. పిల్లలు పాఠశాలకు తిరిగి వెళ్ళే సమయానికి కొత్త ఉద్యోగాలను వెతకడం ప్రారంభిస్తారు. దీంతో తమ కెరీర్లో ఎదగాలని చూస్తున్న వ్యక్తులు కొత్త అవకాశాల కోసం ప్రాధాన్యత ఇస్తారు. సుమారు 71 నుండి 75% మంది వరకు ఉద్యోగాలు మారుతున్నారు. Allsopp గ్రూప్లోని ప్రిన్సిపల్ కన్సల్టెంట్ బాబీ ధాలివాల్ ప్రకారం.. రియల్ ఎస్టేట్, ఆటోమోటివ్, కార్పొరేట్ సేవలతో సహా కీలక పరిశ్రమలలో 75% మంది నిపుణులు సెప్టెంబర్ నాటికి ఉద్యోగాలను మార్చడానికి సిద్ధమవుతున్నారు. సగటు జీతాలు దాదాపు 10-12% పెరుగుతాయి. సౌదీ అరేబియా వంటి ఇతర ప్రాంతాలతో పోలిస్తే, 66% నివాసితులు ఉద్యోగ స్విచ్ని ఎంచుకున్నారు. యూఏఈ జనాభాలో 71% నుండి 75% మంది మార్పును కోరుకుంటున్నారు. దుబాయ్ గ్లోబల్ బిజినెస్ హబ్గా అభివృద్ధి చెందాక ఏటా దాదాపు 30,000 నుండి 60,000 కొత్త వ్యాపారాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో జాబ్ మార్కెట్ కూడా విస్తరిస్తుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









