ఈయూ-మిడ్ ఈస్ట్-ఇండియా కారిడార్ ప్రాజెక్ట్కు బహ్రెయిన్ మద్దతు
- September 24, 2023
బహ్రెయిన్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్ మరియు ఇజ్రాయెల్తో సహా మిడిల్ ఈస్ట్ అంతటా రైల్వే మరియు ఓడరేవు సౌకర్యాలను అనుసంధానించే ప్రతిపాదనకు బహ్రెయిన్ మద్దతును ప్రకటించింది. ఇది భారతదేశం, ఐరోపా మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేయగలదని, ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కీలకంగా మారుతుందని పేర్కొంది. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డెబ్బై ఎనిమిదవ సెషన్లో ప్రసంగించిన సమయంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. "ప్రజలందరి ప్రయోజనం కోసం ఈ ప్రాంతం అభివృద్ధి, శ్రేయస్సుకు దోహదపడే ఈ ప్రతిష్టాత్మక వ్యూహాత్మక ప్రాజెక్ట్ కోసం మేము ఎదురుచూస్తున్నాము," అని డాక్టర్ అల్ జయానీ అన్నారు. న్యూఢిల్లీలో గ్రూప్ ఆఫ్ 20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రారంభించబడిన భారతదేశం-మిడిల్ ఈస్ట్ -యూరోప్ ఆర్థిక కారిడార్ను ప్రపంచ దేశాలు స్వాగతించాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







