ఈజిప్ట్ రోడ్డు ప్రమాదం..35 మంది మృతి
- October 28, 2023
కైరో: ఈజిప్టులోని కైరో-అలెగ్జాండ్రియా మోటర్వేలో బస్సు మరియు అనేక కార్లు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో కనీసం 35 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. "వాడీ అల్-నట్రూన్ సమీపంలోని కైరో-అలెగ్జాండ్రియా ఎడారి రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో 35 మంది మృతి చెందారు. వీరిలో కనీసం 18 మంది కాలిపోయి మరణించారు. కనీసం 53 మంది గాయపడ్డారు" అని స్థానిక అధికారులు తెలిపారు. కారు నుండి ఆయిల్ లీక్ కావడం వల్ల ఈ విషాద ప్రమాదం సంభవించి ఉండవచ్చని, ఇది ఇతర వాహనాలకు మంటలు వ్యాపించిందని, పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









