షురా కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియలో పెరిగిన మహిళల భాగస్వామ్యం
- October 29, 2023
మస్కట్: రాజకీయ జీవితంలో ఒమానీ మహిళల చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకించి మజ్లిస్ అల్ షురా పదవ సారి సభ్యుల ఎన్నికలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం జరగనున్న మజ్లిస్ అల్ షురా పదో దఫా ఎన్నికలలో 738 మంది అభ్యర్థులు సీట్ల కోసం పోటీ పడుతున్నారు. వీరిలో 31 మంది మహిళలు ఉండటం గమనార్హం. నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య 753,690కి చేరుకోగా.. వారిలో 362,844 మంది మహిళలు ఉన్నారు. ఈ ఓటర్లలో 91 శాతం మంది “ఇంతాఖిబ్” అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకోగా, మిగిలిన 9 శాతం మంది ఎన్నికల వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకున్నారు. నేషనల్ రికార్డ్స్ అండ్ ఆర్కైవ్స్ అథారిటీ చైర్మన్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ సలహాదారు షేఖా తమీమా బింట్ మొహమ్మద్ అల్ మహ్రూఖీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రాథమిక చట్టం వివిధ మార్గాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే మహిళల హక్కులకు హామీ ఇస్తుందన్నారు. విద్య, ఉద్యోగ తదితర రంగాలలో ఒమానీ మహిళల కీలక పాత్రను ఆమె హైలైట్ చేసారు. 1970ల నుండి ఒమన్ సాధించిన అద్భుతమైన పురోగతిని గుర్తించి, మహిళలకు ఓటు వేసే మరియు ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలిచే హక్కును కల్పించిన మొదటి GCC రాష్ట్రం ఒమన్ అని గుర్తుచేసుకున్నారు. అయితే, నిర్ణయం తీసుకునే స్థానాల్లో మహిళలు అర్ధవంతమైన భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఇంకా కృషి చేయాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!







