గాజా బాధితులకు ఉచితంగా చికిత్స.. ముందుకొచ్చిన ప్రైవేట్ ఆసుపత్రులు
- November 06, 2023
కువైట్: కువైట్లోని ప్రైవేట్ ఆసుపత్రులు గాజా స్ట్రిప్ నుండి గాయపడిన వారికి ఉచితంగా చికిత్స చేయడానికి ముందుకొచ్చాయి. గాజాలో మానవతావాద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధికి రాసిన లేఖలో నేషనల్ హాస్పిటల్స్ యూనియన్ అధిపతి డాక్టర్ అయ్మాన్ అల్-ముతావా తెలియజేసారు. కువైట్ రాష్ట్రం ప్రాంతీయంగా.. అంతర్జాతీయంగా పోషిస్తున్న మార్గదర్శక మానవతా పాత్రలో ఇది భాగం అన్నారు. అల్-సలామ్, అలియా, దార్ అల్-షిఫా, వారా, అల్-మౌవసాత్ మరియు తైబా ఆసుపత్రులతో సహా ప్రైవేట్ ఆసుపత్రులు గాజా నుండి గాయపడిన వ్యక్తులకు ఉచితంగా చికిత్స చేసేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. కువైట్ లో గాజా బాధితుల చికిత్స కేసులను స్వీకరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









