యూఏఈ, గల్ఫ్ ప్రయాణికులకు పెరగనున్న ఎయిర్ కనెక్టివిటీ

- November 15, 2023 , by Maagulf
యూఏఈ, గల్ఫ్ ప్రయాణికులకు పెరగనున్న ఎయిర్ కనెక్టివిటీ

యూఏఈ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యూఏఈ సహా గల్ఫ్ ప్రాంతానికి కనెక్టివిటీని పెంచనుంది. అలాగే భారతదేశంలోని వివిధ టైర్ 2 మరియు 3 నగరాల్లోని గల్ఫ్ ప్రయాణికులకు మరింత కనెక్టివిటీని అందించాలని చూస్తోందని సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. “సౌదీ అరేబియాకు కొంత సామర్థ్యం పెరుగుతుంది. బహ్రెయిన్, ఖతార్ మరియు యూఏఈకి సంబంధించి కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. కేరళ-గల్ఫ్ మార్కెట్‌లో ఉన్న పాయింట్‌లకు మించి భారతదేశంలోని ఇతర పాయింట్‌లకు కొంత కనెక్టివిటీని అందిస్తాము. తద్వారా యూఏఈ మరియు గల్ఫ్ ప్రాంతానికి చెందిన ప్రజలు భారతదేశంలోని వివిధ నగరాల్లో మెరుగైన కనెక్టివిటీని కలిగి ఉంటారు.”అని ఇండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ బడ్జెట్ క్యారియర్ భారతదేశం -యూఏఈ మధ్య వారానికి 105 విమానాలను నడుపుతోంది. ఇందులో దుబాయ్‌కి 80, షార్జాకు 77, అబుదాబికి 31, రస్ అల్ ఖైమాకు 5 మరియు అల్ ఐన్‌కు 2 ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతం అంతటా, ఇది వారానికి 308 విమానాలను నడుపుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com