చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది మృతి
- November 16, 2023
బీజింగ్: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లోని లిషి జిల్లాలో లియులియాంగ్ నగరంలో ఐదంతస్తుల భవనంలో ఓ ప్రైవేటు బొగ్గు గని సంస్థ కార్యాలయంలో గురువారం మంటలు చెలరేగాయి. రెండవ అంతస్తులో ఉన్న ఈ కార్యాలయం నుంచి మిగతా అంతస్తులకు మంటలు విస్తరించాయి. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో 26 మంది మరణించారు. 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు ప్రమాదస్థలికి చేరుకున్నాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు అధికారులు. చైనా భారీ అగ్ని ప్రమాదాలకు కేంద్రంగా మారింది. హై రేంజ్ అపార్టుమెంట్ లో తరచుగా అగ్నిప్రమాదాలుగా జరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్ నెలలో అన్యాంగ్ నగరంలోని ఓ కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించి 38 మంది దుర్మరణం పాలయ్యారు. అంతకు ముందు ఏడాది అక్టోబర్ నెలలో షెన్ యాంగ్ నగరంలో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించగా.. 30 మంది గాయపడ్డారు. 2015లో టింజిన్ లోని రసాయన గోదాముల్లో జరిగిన వరుస పేలుళ్లలో 175 మంది చనిపోయారు. చైనాలోని బొగ్గు గనుల్లో అగ్ని ప్రమాదాలు తరుచు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025