కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం
- November 16, 2023
తెలంగాణ: సీఎం కేసీఆర్ సభలో ఓ వ్యక్తి బుల్లెట్లతో తిరగడం కలకలం రేపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వద సభ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తూ భారీ సభల్లో పాల్గొంటూ వస్తున్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలుపుతూ , కాంగ్రెస్ బిజెపి పార్టీల ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. నేడు మెదక్ , నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.
గురువారం సాయంత్రం కేసీఆర్ నర్సాపూర్ సభలో ప్రసంగిస్తుండగా..అస్లాం అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడం తో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకొని చెక్ చేయగా అతడి నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అస్లాంను విచారిస్తున్నారు. బుల్లెట్లు ఎక్కడివి..? ఎందుకు తీసుకొచ్చాడు..? వాటితో ఏంచేయాలి అనుకున్నాడు..? వంటి ప్రశ్నలు అడుగుతూ దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







