విశాఖ ఘటన పై సీఎం జగన్ దిగ్భ్రాంతి..
- November 20, 2023
అమరావతి: విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. లక్షల విలువ చేసే మత్స్య సంపద, బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఈ ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ఒక్కో బోటులో 5 నుంచి 6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలి బూడిద కాగా.. మరో 40 బోట్లు ధ్వంసమయ్యాయి. రూ.30కోట్లకు పైగా ఆస్తినష్టం కాగా.. 3వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఇంకా భారీగా ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ లో మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. చివరి బోటు మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. బోట్లలో డీజిల్ నిండి ఉండడంతో దట్టంగా పొగ వ్యాపించింది. మంటలు చెలరేగి 40కి పైగా మరబోట్లు దగ్ధమయ్యాయని.. పోలీసులు తెలిపారు. రాత్రి 10:30 గంటలకు మంటలు చెలరేగాయని.. గాలుల తీవ్రతతో పక్క బోట్లకు వ్యాపించాయని తెలిపారు. బోట్లలో సిలిండర్లు, డీజిల్ ఉండడంతో మంటల తీవ్రత పెరిగిందని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డీసీపీ ఆనందరెడ్డి తెలిపారు. కొన్ని బోట్లు దగ్ధమయ్యాయి, మరికొన్ని తరలించాం, ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందని డీసీపీ ఆనందరెడ్డి వివరించారు. ఈ ప్రమాదం పై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని విశాఖ సీపీ రవిశంకర్ తెలిపారు. ప్రమాదం తర్వాత యువకులు పరారయ్యారని.. వారికోసం గాలిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







