ఇండియా వస్తున్న కార్గో షిప్ హైజాక్
- November 20, 2023
భారతదేశానికి వెళుతున్న కార్గో షిప్ ను హౌతీ మిలిటెంట్లు హెలికాప్టర్ సాయంతో హైజాక్ చేశారు. యెమెన్ దేశానికి చెందిన హౌతీ మిలీషియా దక్షిణ ఎర్ర సముద్రంలో భారత్కు చెందిన అంతర్జాతీయ కార్గో షిప్ను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. భారత్ కార్గో షిప్ హైజాక్ చేయడం ఇరానియన్ ఉగ్రవాద చర్య అని ఇజ్రాయెల్ పేర్కొంది. హైజాక్ అయిన ఓడలో ఓడలో ఇజ్రాయెల్ పౌరులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు.
దక్షిణ ఎర్ర సముద్రం నుండి నౌకను యెమెన్ నౌకాశ్రయానికి తీసుకువెళ్లినట్లు బృందం తెలిపింది. హౌతీలు హెలికాప్టర్ను ఉపయోగించి ఓడపై ఫైటర్లను దించడం ద్వారా హైజాక్ చేశారు. ఈ కార్గో షిప్ బ్రిటీష్ కంపెనీకి చెందినదని, దీనిని జపాన్ కంపెనీ నిర్వహిస్తోందని టెల్ అవీవ్ తెలిపింది. నౌకలో ఉక్రేనియన్, బల్గేరియన్, ఫిలిప్పీన్స్, మెక్సికన్ సహా వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు.
ఈ నౌకలో భారతీయులు ఎవరూ లేరని ఇజ్రాయెల్ తెలిపింది. తుర్కియే నుంచి భారత్ వస్తున్న ఈ నౌకను మిలిటెంట్లు హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. ఇలాంటి ఘటనలు అంతర్జాతీయ అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తాయని ఇజ్రాయెల్ పేర్కొంది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









