ఎయిర్ టాక్సీలు: తగ్గనున్న 40% ట్రావెల్ టైమ్
- November 20, 2023
యూఏఈ: 2026 మొదటి త్రైమాసికం నాటికి యూఏఈ ఆకాశంలో పూర్తి-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు కనిపించనున్నాయి. యూఏఈ అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ (AAM) కార్యక్రమాలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభ కానున్నాయి. ప్రజలు త్వరలో ట్రాఫిక్ సమస్యల బైబై చెబుతూ.. ఎయిర్ టాక్సీలలో వెళ్లవచ్చు. దీంతో ఎమిరేట్స్లో ప్రయాణ సమయం నగరాల్లో 40 శాతం ఆదా అవుతుందని యూఏఈ ప్రభుత్వ ఇన్నోవేటివ్ మొబిలిటీ నిపుణుడు, చీఫ్ స్పెషలిస్ట్ రూబా అబ్దేలాల్ అన్నారు. ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా లేదా కూడళ్లతో ఆగాల్సిన అవసరం లేకుండా మరియు ట్రాఫిక్ లైట్లు, రౌండ్అబౌట్లపై వేచి ఉండకుండా ఒక పాయింట్ నుండి మరొక పాయింట్కి సులభంగా.. వేగంగా చేరుకోవచ్చని తెలిపారు. దీంతోపాటు ఎయిర్ టాక్సీల రాకతో మిలియన్ల కొద్దీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయని, రాబోయే పదేళ్లలో ఈ ప్రాంతంలో వేలాది ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









