ఎయిర్ టాక్సీలు: తగ్గనున్న 40% ట్రావెల్ టైమ్
- November 20, 2023
యూఏఈ: 2026 మొదటి త్రైమాసికం నాటికి యూఏఈ ఆకాశంలో పూర్తి-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు కనిపించనున్నాయి. యూఏఈ అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ (AAM) కార్యక్రమాలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభ కానున్నాయి. ప్రజలు త్వరలో ట్రాఫిక్ సమస్యల బైబై చెబుతూ.. ఎయిర్ టాక్సీలలో వెళ్లవచ్చు. దీంతో ఎమిరేట్స్లో ప్రయాణ సమయం నగరాల్లో 40 శాతం ఆదా అవుతుందని యూఏఈ ప్రభుత్వ ఇన్నోవేటివ్ మొబిలిటీ నిపుణుడు, చీఫ్ స్పెషలిస్ట్ రూబా అబ్దేలాల్ అన్నారు. ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా లేదా కూడళ్లతో ఆగాల్సిన అవసరం లేకుండా మరియు ట్రాఫిక్ లైట్లు, రౌండ్అబౌట్లపై వేచి ఉండకుండా ఒక పాయింట్ నుండి మరొక పాయింట్కి సులభంగా.. వేగంగా చేరుకోవచ్చని తెలిపారు. దీంతోపాటు ఎయిర్ టాక్సీల రాకతో మిలియన్ల కొద్దీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయని, రాబోయే పదేళ్లలో ఈ ప్రాంతంలో వేలాది ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









