ఎయిర్ టాక్సీలు: తగ్గనున్న 40% ట్రావెల్ టైమ్
- November 20, 2023
యూఏఈ: 2026 మొదటి త్రైమాసికం నాటికి యూఏఈ ఆకాశంలో పూర్తి-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు కనిపించనున్నాయి. యూఏఈ అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ (AAM) కార్యక్రమాలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభ కానున్నాయి. ప్రజలు త్వరలో ట్రాఫిక్ సమస్యల బైబై చెబుతూ.. ఎయిర్ టాక్సీలలో వెళ్లవచ్చు. దీంతో ఎమిరేట్స్లో ప్రయాణ సమయం నగరాల్లో 40 శాతం ఆదా అవుతుందని యూఏఈ ప్రభుత్వ ఇన్నోవేటివ్ మొబిలిటీ నిపుణుడు, చీఫ్ స్పెషలిస్ట్ రూబా అబ్దేలాల్ అన్నారు. ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా లేదా కూడళ్లతో ఆగాల్సిన అవసరం లేకుండా మరియు ట్రాఫిక్ లైట్లు, రౌండ్అబౌట్లపై వేచి ఉండకుండా ఒక పాయింట్ నుండి మరొక పాయింట్కి సులభంగా.. వేగంగా చేరుకోవచ్చని తెలిపారు. దీంతోపాటు ఎయిర్ టాక్సీల రాకతో మిలియన్ల కొద్దీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయని, రాబోయే పదేళ్లలో ఈ ప్రాంతంలో వేలాది ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి