నరేంద్రమోదీ మంత్రి వర్గంలో త్వరలో మార్పులు

- May 27, 2016 , by Maagulf
నరేంద్రమోదీ మంత్రి వర్గంలో త్వరలో మార్పులు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంత్రివర్గంలో త్వరలోనే మార్పులుచేర్పులు జరగనున్నాయి. ఈ విషయాన్ని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వెల్లడించారు. దిల్లీలోని భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అమిత్‌షా.. కేబినెట్‌ శాఖల్లో మార్పులు జరగనున్నట్లు తెలిపారు. అయితే మార్పుల ప్రక్రియకు ఇంకా తేదీని నిర్ణయించలేదన్నారు. అయితే జూన్‌ మొదటివారంలో కేబినెట్‌లో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రులను మార్చేందుకు ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు శర్వానంద సోనోవాల్‌ అసోం ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో క్రీడాశాఖ ఖాళీ అయింది. దీంతో కేబినెట్‌లోకి కొత్త మంత్రులు రానున్నారు. అంతేగాక.. కొన్ని శాఖల్లో పనితీరు సరిగా లేకపోవడంతో ఆయా మంత్రులను తొలగించనున్నట్లు సమాచారం. అయితే.. సీనియర్‌ భాజపా నేతలు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌, నితిన్‌గడ్కరీ మాత్రం కేబినెట్‌లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com