నరేంద్రమోదీ మంత్రి వర్గంలో త్వరలో మార్పులు
- May 27, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంత్రివర్గంలో త్వరలోనే మార్పులుచేర్పులు జరగనున్నాయి. ఈ విషయాన్ని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా వెల్లడించారు. దిల్లీలోని భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అమిత్షా.. కేబినెట్ శాఖల్లో మార్పులు జరగనున్నట్లు తెలిపారు. అయితే మార్పుల ప్రక్రియకు ఇంకా తేదీని నిర్ణయించలేదన్నారు. అయితే జూన్ మొదటివారంలో కేబినెట్లో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రులను మార్చేందుకు ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు శర్వానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో క్రీడాశాఖ ఖాళీ అయింది. దీంతో కేబినెట్లోకి కొత్త మంత్రులు రానున్నారు. అంతేగాక.. కొన్ని శాఖల్లో పనితీరు సరిగా లేకపోవడంతో ఆయా మంత్రులను తొలగించనున్నట్లు సమాచారం. అయితే.. సీనియర్ భాజపా నేతలు అరుణ్జైట్లీ, రాజ్నాథ్సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్గడ్కరీ మాత్రం కేబినెట్లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







