నరేంద్రమోదీ మంత్రి వర్గంలో త్వరలో మార్పులు
- May 27, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంత్రివర్గంలో త్వరలోనే మార్పులుచేర్పులు జరగనున్నాయి. ఈ విషయాన్ని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా వెల్లడించారు. దిల్లీలోని భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అమిత్షా.. కేబినెట్ శాఖల్లో మార్పులు జరగనున్నట్లు తెలిపారు. అయితే మార్పుల ప్రక్రియకు ఇంకా తేదీని నిర్ణయించలేదన్నారు. అయితే జూన్ మొదటివారంలో కేబినెట్లో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రులను మార్చేందుకు ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు శర్వానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో క్రీడాశాఖ ఖాళీ అయింది. దీంతో కేబినెట్లోకి కొత్త మంత్రులు రానున్నారు. అంతేగాక.. కొన్ని శాఖల్లో పనితీరు సరిగా లేకపోవడంతో ఆయా మంత్రులను తొలగించనున్నట్లు సమాచారం. అయితే.. సీనియర్ భాజపా నేతలు అరుణ్జైట్లీ, రాజ్నాథ్సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్గడ్కరీ మాత్రం కేబినెట్లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









