క్యాంటీన్లో ఘర్షణకు దిగిన లాయర్లు..
- December 13, 2023
న్యూ ఢిల్లీ: క్యాంటీన్లో లంచ్ చేద్దామని వచ్చిన కొందరు లాయర్లు సీటు కోసం ఘర్షణకు దిగారు. ప్రశాంతంగా ఉండే క్యాంటీన్ వాతావరణాన్ని చెడగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఢిల్లీ హైకోర్టు లాయర్లు క్యాంటీన్లో సీటు కోసం కొట్టుకున్నారు. లాయర్ల మధ్య జరిగిన ఘర్షణతో క్యాంటీన్లోని టేబుళ్లపై ఆహార పదార్థాలు పడి పాడైపోయాయి. భోజనం చేస్తున్న ఇతర లాయర్లు ఇబ్బంది పడ్డారు. ఓ లేడీ సీనియర్ అడ్వకేట్ను మరో మహిళా లాయర్ చెంపపై కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
భోజనానికి వచ్చిన లాయర్ల వద్దకు ఓ లేడీ లాయర్ దూసుకువచ్చి గొడవ పెట్టుకుందని అన్నారు. ఆమెకు సర్ది చెప్పేందుకు కొందరు సీనియర్ లాయర్లు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ లేడీ లాయర్ వినిపించుకోలేదు. టేబుళ్లపై ఉన్న ఆహార పదార్థాలను ఆమె చెల్లాచెదురు చేశారు.
ఓ లాయర్ తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన జరిగిన గొడవ గురించి చెప్పారు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో చూడొచ్చు. భోజనం చేస్తున్న వారంతా ఈ గొడవ సమయంలో నిలబడాల్సి వచ్చింది. లాయర్లు ఇంతలా గొడవ పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తాజా వార్తలు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి









