సలార్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..
- December 13, 2023
హైదరాబాద్: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ ఈ నెల 22న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఆల్రెడీ ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మూవీ నుంచి మొదటి సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
సూర్యుడే గొడుగు పట్టి.. అంటూ సాగే ఈ సాంగ్ లో ప్రభాస్, పృథ్వి రాజ్ సుకుమారన్ మధ్య స్నేహాన్ని చూపించబోతున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. కృష్ణ కాంత్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించగా హరిణి ఇవతూరి ఈ పాటని పాడారు. ఎమోషనల్ గా ఉన్న ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే ఈ మూవీ నుంచి మరో ట్రైలర్ ని, సాంగ్ ని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారట. ఈ సెకండ్ ట్రైలర్ ని పూర్తి యాక్షన్ కట్ తో రెడీ చేయబోతున్నారు.
అలాగే ఈ ప్రమోషన్స్ లో భాగంగా.. ప్రభాస్, పృథ్వీరాజ్, శృతిహాసన్, ప్రశాంత్ నీల్ తో కలిపి ఒక ఇంటర్వ్యూని కూడా ప్లాన్ చేశారట. కాగా ఈ మూవీ ‘A’ సర్టిఫికెట్ తో 2 గంటల 55 నిమిషాల 22 సెకన్ల రన్టైమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నుంచి ఒక మంచి సినిమా రాక రెబల్ అభిమానులు నిరాశలో ఉన్నారు. మరి వారికీ ఈ సినిమా ఉత్సాహాన్ని ఇస్తుందా లేదా చూడాలి. కాగా ఈ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం ‘ఉగ్రమ్’ రీమేక్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలని సలార్ నిర్మాత.. నిజం లేదని కొట్టిపారేశారు.
తాజా వార్తలు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి









