యూఏఈ కంపెనీలలో 2024లో సాలరీ హైక్: సర్వే
- December 20, 2023
యూఏఈ: యూఏఈలో చమురుయేతర రంగాలలో.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో 2024 లో సాలరీలు 4.5 శాతం పెరుగుతాయని, బుధవారం విడుదల చేసిన కొత్త నివేదిక తెలిపింది. కూపర్ ఫిచ్ విడుదల చేసిన “సాలరీ గైడ్ యూఏఈ 2024” నివేదిక ప్రకారం.. మెజారిటీ - 53 శాతం - సంస్థలు వచ్చే ఏడాది తమ ఉద్యోగుల జీతాలను పెంచాలని భావిస్తున్నాయి. మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కంపెనీలు (39 శాతం) సాలరీలను 5 శాతం వరకు పెంచడానికి, 6 నుండి 9 శాతం కంపెనీలు 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచాలని సిద్ధమవుతున్నాయట. ఇదిలా ఉండగా.. 2024 లో ఐదవ వంతు(21 శాతం) సంస్థలు ఎంప్లాయిస్ జీతాలను తగ్గించాలని భావిస్తున్నాయట. అయితే, ఇది ప్రతిభ ఆధారంగా ఉండనున్నట్లు నివేదికలో తెలిపారు. గత సంవత్సరం 7.9 శాతంతో పోలిస్తే యూఏఈ ఆర్థిక వృద్ధి దాదాపు మూడు శాతం వరకు ఉండనుంది. చమురుయేతర రంగాలలో రియల్ ఎస్టేట్, ట్రావెల్ మరియు టూరిజం, ఏవియేషన్ యూఏఈ ఆర్ధిక వృద్ధికి బాసటగా నిల్వనున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. కూపర్ ఫిచ్ సర్వేలో 81 శాతం సంస్థలు 2023 లో ఉద్యోగుల జీతాలలో మార్పులు చేయలేదు. 54 శాతానికి పైగా కంపెనీలు 2023 లో తమ ఉద్యోగుల జీతాలు పెంచాయట. అదే సమయంలో అకౌంటింగ్, రసాయనాలు, వినియోగ వస్తువులు, ఆసుపత్రి మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో పనిచేసే ఉద్యోగులు ఆరు నెలల ప్రాథమిక జీతం వరకు బోనస్లను ఆశించవచ్చని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







