యూఏఈ కంపెనీలలో 2024లో సాలరీ హైక్: సర్వే

- December 20, 2023 , by Maagulf
యూఏఈ కంపెనీలలో 2024లో సాలరీ హైక్: సర్వే

యూఏఈ: యూఏఈలో చమురుయేతర రంగాలలో.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో 2024 లో సాలరీలు 4.5 శాతం పెరుగుతాయని, బుధవారం విడుదల చేసిన కొత్త నివేదిక తెలిపింది. కూపర్ ఫిచ్ విడుదల చేసిన “సాలరీ గైడ్ యూఏఈ 2024” నివేదిక ప్రకారం.. మెజారిటీ - 53 శాతం - సంస్థలు వచ్చే ఏడాది తమ ఉద్యోగుల జీతాలను పెంచాలని భావిస్తున్నాయి. మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కంపెనీలు (39 శాతం) సాలరీలను 5 శాతం వరకు పెంచడానికి, 6 నుండి 9 శాతం కంపెనీలు 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచాలని సిద్ధమవుతున్నాయట. ఇదిలా ఉండగా.. 2024 లో ఐదవ వంతు(21 శాతం) సంస్థలు ఎంప్లాయిస్ జీతాలను తగ్గించాలని భావిస్తున్నాయట. అయితే, ఇది ప్రతిభ ఆధారంగా ఉండనున్నట్లు నివేదికలో తెలిపారు.  గత సంవత్సరం 7.9 శాతంతో పోలిస్తే యూఏఈ ఆర్థిక వృద్ధి దాదాపు మూడు శాతం వరకు ఉండనుంది. చమురుయేతర రంగాలలో రియల్ ఎస్టేట్, ట్రావెల్ మరియు టూరిజం, ఏవియేషన్ యూఏఈ ఆర్ధిక వృద్ధికి బాసటగా నిల్వనున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. కూపర్ ఫిచ్ సర్వేలో 81 శాతం సంస్థలు 2023 లో ఉద్యోగుల జీతాలలో మార్పులు చేయలేదు. 54 శాతానికి పైగా కంపెనీలు 2023 లో తమ ఉద్యోగుల జీతాలు పెంచాయట. అదే సమయంలో అకౌంటింగ్, రసాయనాలు, వినియోగ వస్తువులు, ఆసుపత్రి మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో పనిచేసే ఉద్యోగులు ఆరు నెలల ప్రాథమిక జీతం వరకు బోనస్‌లను ఆశించవచ్చని నివేదిక పేర్కొంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com