జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సిఎం జగన్
- December 20, 2023
అమరావతి: సిఎం జగన్ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద నిధులు విడుదల చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 51 మందికి కొత్తగా అడ్మిషన్లు అందించారు. అలాగే…51 మంది నిమిత్తం రూ. 9.50 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. ఇప్పటికే విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న 408 మంది విద్యార్థులకు ఈ సీజనులో రూ 41.50 కోట్ల చెల్లింపులు జరుపుతున్న ప్రభుత్వం…ఈ పథకం కింద ఇప్పటి వరకు మొత్తంగా రూ. 107 కోట్లు ఖర్చు పెట్టింది.
సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్….ప్రిలిమ్స్ పాస్ అయిన 95 మందికి రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. మెయిన్స్ పాస్ అయిన 11 మందికి రూ. 1.50 లక్షల సాయం చేశారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థుల తలరాతలు మారుస్తున్నాయని చెప్పారు. ఈ పథకం ద్వారా ఉన్నత స్థితికి వెళ్లిన విద్యార్థులు రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకోవాలని… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మరింత పేదలకు ఉన్నత స్థితిలోకి వెళ్లిన విద్యార్థులు ఆదుకోవాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- కువైట్ కాన్సులేట్ పై దాడి.. ఒమన్ ఫైర్..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..









