దుబాయ్ లో ఘనంగా ప్రవాస తెలుగు వారి 'క్రూజ్ క్రిస్మస్' వేడుకలు
- December 20, 2023
దుబాయ్: దుబాయ్ లో ఉన్న క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్ సామ్యూల్ రత్నం నీలా
ఆధ్వర్యంలో ఘనంగా దెయిరా క్రీక్ Dhow Cruise నందు అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా క్రైస్తవులు మరియు ఇతర మతస్థులు అందరూ రెండు వందల కుటుంబాలు,వారి పిల్లలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాల క్వయర్ తో కలిసి అందరూ పాటలతో , ప్రార్థనలతో అలరించారు. బ్రదర్ అరవింద్ వుడ్స్-సాక్సోఫోన్, యేసు,మేరి జ్యోతి బృందం వారు క్రిస్మస్ కేరల్స్ తో గాత్ర కచేరితో అలరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ లో వివిధ సంఘాల పాస్టర్స్ మరియు సంఘ పెద్దలలో పాటు సామాజిక కార్యకర్తలు శ్రీకాంత్ చిత్తర్వు(మా గల్ఫ్ న్యూస్ అధినేత), పాస్టర్.జాన్ ప్రసాద్, పాస్టర్.జైకుమార్ రబ్బి, ఇమ్మాన్యేల్ నీలా,జూలియాన హుర్గోయి, పాస్టర్.సంపదరావు, పాస్టర్.రత్నరాజు, పాస్టర్.సాల్మన్ రాజు, జోయల్ మీడియా టీమ్ ,బ్రదర్.సతీష్ ఏలేటి తదితరులు పాల్గొన్నారు.









తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







