సౌదీయేతర నంబర్ ప్లేట్లపై ‘మురూర్’ కీలక ఆదేశాలు
- December 22, 2023
రియాద్: సౌదీయేతర నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలను లైసెన్స్ జారీ చేసిన దేశంలోని పౌరులు మాత్రమే నడపాలని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) స్పష్టం చేసింది. ఈ విషయంలో ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని డిపార్ట్మెంట్ తెలిపింది. ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని, ఇటాంటి ఉల్లంఘనలపై శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సౌదీయేతర లైసెన్స్ ప్లేట్లను కలిగి ఉన్న కార్లు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి అన్ని ట్రాఫిక్ పెట్రోలింగ్ బృందాలను పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఆదేశఆలు జారీ చేసిందన్నారు. సౌదీయేతర నంబర్ ప్లేట్లను కలిగి ఉన్న కార్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసినట్లు మురూర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







