దుబాయ్ లో డెలివరీ రైడర్లందకీ త్వరలో ఎలక్ట్రిక్ బైక్లు
- December 22, 2023
దుబాయ్: ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్లకు మారడానికి డెలివరీ కంపెనీల కోసం ప్రోటోటైప్ ఇ-బైక్ను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) గురువారం ప్రవేశపెట్టింది. దీంతో భవిష్యత్ వాణిజ్య రవాణా సేవల పరిధిని విస్తరించడం, మెరుగుపరచడం, సున్నా-ఉద్గార రవాణా మార్గాల వైపు మార్పును వేగవంతం చేయడం అని ఆర్టీఏ లైసెన్సింగ్ ఏజెన్సీలో వాణిజ్య రవాణా కార్యకలాపాల డైరెక్టర్ ముహన్నద్ ఖలీద్ అల్ ముహైరి తెలిపారు. డెలివరీ రైడర్లకు తగిన ప్రోటోటైప్ ఇ-బైక్ మోడల్ను అభివృద్ధి చేయడానికి పరిశ్రమ నిపుణులతో ఆర్టీఏ సహకరించిందని అల్ ముహైరి చెప్పారు. ఈ-బైక్ల కోసం దుబాయ్ అంతటా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందన్నారు. ఇ-బైక్లకు మారడం శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుందని అల్ ముహైరి వివరించారు. కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గించేందుకు దుబాయ్ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా ఆర్టీఏ ప్రయత్నిస్తోందని అల్ ముహైరి చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







