దుబాయ్ లో డెలివరీ రైడర్లందకీ త్వరలో ఎలక్ట్రిక్ బైక్లు
- December 22, 2023
దుబాయ్: ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్లకు మారడానికి డెలివరీ కంపెనీల కోసం ప్రోటోటైప్ ఇ-బైక్ను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) గురువారం ప్రవేశపెట్టింది. దీంతో భవిష్యత్ వాణిజ్య రవాణా సేవల పరిధిని విస్తరించడం, మెరుగుపరచడం, సున్నా-ఉద్గార రవాణా మార్గాల వైపు మార్పును వేగవంతం చేయడం అని ఆర్టీఏ లైసెన్సింగ్ ఏజెన్సీలో వాణిజ్య రవాణా కార్యకలాపాల డైరెక్టర్ ముహన్నద్ ఖలీద్ అల్ ముహైరి తెలిపారు. డెలివరీ రైడర్లకు తగిన ప్రోటోటైప్ ఇ-బైక్ మోడల్ను అభివృద్ధి చేయడానికి పరిశ్రమ నిపుణులతో ఆర్టీఏ సహకరించిందని అల్ ముహైరి చెప్పారు. ఈ-బైక్ల కోసం దుబాయ్ అంతటా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందన్నారు. ఇ-బైక్లకు మారడం శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుందని అల్ ముహైరి వివరించారు. కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గించేందుకు దుబాయ్ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా ఆర్టీఏ ప్రయత్నిస్తోందని అల్ ముహైరి చెప్పారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









