ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ..
- December 22, 2023
అమరావతి: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఈ కొత్త పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీ అని తెలిపారు. అన్ని వర్గాలను కలిసి, అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ పెట్టానని వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పుట్టిందని స్పష్టం చేశారు లక్ష్మీనారాయణ.
‘ఐపీఎస్ కు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజల మధ్యకు వచ్చా. అనేక వర్గాల ప్రజలను కలిశాను. వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగా. సమస్యలు పరిష్కారాలను వారినే అడిగి తెలుసుకుంటూ, రాష్ట్రం మొత్తం తిరిగి చేసిన అధ్యయనంతో రాజ్యాధికారం ముఖ్యమన్న విషయాన్ని గుర్తించా’ అని లక్ష్మీనారాయణ తెలిపారు.
”జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా వీవీ లక్ష్మీనారాయణ, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చిన్నయ్య దొరను ప్రకటించారు. శ్రమతో అద్భుతాలు సృష్టించే ఆలోచన ప్రస్తుత పార్టీలకు లేదన్నారు లక్ష్మీనారాయణ. అందుకే కొత్త రాజకీయ పార్టీ పెట్టానని చెప్పారాయన. వారు తిన్నారని వీరు, వీళ్ళు తిన్నారని వాళ్లు.. నిత్యం పార్టీలు విమర్శలు చేసుకోవడమే. పెత్తందార్లు మారినా బానిసత్వం నడుస్తోంది. అభివృద్ధి, అవసరం పేరుతో ఇప్పటివరకు నేతలు చెప్పారు. అభివృద్ధితో అవసరాలు తీర్చడమే జై భారత్ నేషనల్ పార్టీ తెలియజేస్తుంది” అని లక్ష్మీనారాయణ అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







