ఒమన్ లో నీటి కనెక్షన్ ఫీజు తగ్గింపు
- January 11, 2024
మస్కట్: నివాస యూనిట్లకు త్రాగునీటి సేవల కనెక్షన్ కోసం చెల్లించే మొత్తాలను తగ్గించాలని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశాలు పౌరులపై భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అథారిటీ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ (APSR) వెల్లడించింది. నీటి కనెక్షన్ సేవల తగ్గింపు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తుందని APSR తెలిపింది. రెసిడెన్షియల్ యూనిట్ల నీటి కనెక్షన్ ఫీజులను OMR700 నుండి OMR200కి తగ్గించినట్లు వెల్లడించింది. అయితే, నాన్-రెసిడెన్షియల్ యూనిట్లకు (ప్రభుత్వం, పారిశ్రామిక, వాణిజ్య మరియు పర్యాటకులకు), నీటి కనెక్షన్ ఫీ భవనం, ప్రాంతం ప్రకారం వసూలు చేయబడుతుందని తెలిపింది. మొత్తం వైశాల్యం 500 చదరపు మీటర్లు (చ.మీ) కంటే తక్కువగా ఉన్న భవనాలకు OMR600.. 501 నుండి 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భవనాలకు OMR950.. 1,001 మరియు 2,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భవనాలకు OMR1,300, 2,001 కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న భవనాలకు OMR1,300 ఫీ లేదా అసలు కనెక్షన్ విలువ ఏది ఎక్కువ అయితే అది ఛార్జ్ చేయబడుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







