ఒమన్ లో నీటి కనెక్షన్ ఫీజు తగ్గింపు
- January 11, 2024
మస్కట్: నివాస యూనిట్లకు త్రాగునీటి సేవల కనెక్షన్ కోసం చెల్లించే మొత్తాలను తగ్గించాలని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశాలు పౌరులపై భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అథారిటీ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ (APSR) వెల్లడించింది. నీటి కనెక్షన్ సేవల తగ్గింపు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తుందని APSR తెలిపింది. రెసిడెన్షియల్ యూనిట్ల నీటి కనెక్షన్ ఫీజులను OMR700 నుండి OMR200కి తగ్గించినట్లు వెల్లడించింది. అయితే, నాన్-రెసిడెన్షియల్ యూనిట్లకు (ప్రభుత్వం, పారిశ్రామిక, వాణిజ్య మరియు పర్యాటకులకు), నీటి కనెక్షన్ ఫీ భవనం, ప్రాంతం ప్రకారం వసూలు చేయబడుతుందని తెలిపింది. మొత్తం వైశాల్యం 500 చదరపు మీటర్లు (చ.మీ) కంటే తక్కువగా ఉన్న భవనాలకు OMR600.. 501 నుండి 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భవనాలకు OMR950.. 1,001 మరియు 2,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భవనాలకు OMR1,300, 2,001 కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న భవనాలకు OMR1,300 ఫీ లేదా అసలు కనెక్షన్ విలువ ఏది ఎక్కువ అయితే అది ఛార్జ్ చేయబడుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







