సౌదీలో చిక్కుకున్న 200మంది భారతీయులు
- May 30, 2016
సుమారు 200 మంది రాజస్థాన్కు చెందిన కార్మికులు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయారు. ఝున్ఝును జిల్లాకు చెందిన వీరికి కొన్ని నెలలుగా జీతాలు అందడం లేదని.. కనీసం భారత్కు రావడానికి టిక్కెట్ కొనుక్కోవడానికి కూడా వారి వద్ద డబ్బు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని వారి కుటుంబసభ్యులు వెల్లడించారు. అల్సిసార్ పట్టణానికి చెందిన మహమ్మద్ ఇషాక్, మహమ్మద్ ముస్లిం అనే వ్యక్తులు సౌదీ నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా తమ పరిస్థితిని వివరించారు. తాము పనిచేసే కంపెనీని వేడుకుంటున్నా ఫలితం లేదని, సౌదీలో భారత రాయబార కార్యాలయం నుంచి కూడా సహాయం అందడంలేదని వారి కుటుంబసభ్యులు చెప్తున్నారు.
తన తండ్రి ఇషాక్ 25 ఏళ్లుగా సౌదీలోనే పనిచేస్తున్నారని.. గత ఆర్నెల్లుగా జీతాలు ఇవ్వడంలేదని ఆయన కొడుకు రషీద్ తెలిపారు. 200 మంది కార్మికులు సౌదీలో పలువురు అధికారులను వేడుకుంటున్నా ఎలాంటి సహాయం అందడం లేదని మహమ్మద్ సోదరుడు వెల్లడించారు. వారి పాస్పోర్టులు కూడా వారు పనిచేస్తున్న కంపెనీ వద్ద ఉన్నాయని, దాంతో నిస్సహాయులుగా అక్కడున్నారని వాపోయారు. కార్మికులు సౌదీలో చిక్కుకుపోవడం పట్ల ఎలాంటి అధికారిక సమాచారం తమ వద్ద లేదని జిల్లా కలెక్టర్ బాబులాల్ మీనా తెలిపారు. ఝున్ఝును ఎంపీ సంతోష్ అహ్లావత్ మాట్లాడుతూ సౌదీలో చిక్కుకున్న వారి గురించి సమాచారం సేకరించి విదేశాంగ శాఖను సహాయం కోరతానని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







