ఖతార్లో 'ఫ్రూట్స్ వీక్'ని ప్రారంభించిన జపాన్
- January 20, 2024
దోహా: జపాన్ వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ది-పెర్ల్ ఖతార్లోని జుంకో రెస్టారెంట్లో జపనీస్ ఫ్రూట్స్ వీక్ ప్రారంభం అయింది. ఖతార్లోని జపాన్ రాయబారి హెచ్ఈ సతోషి మేడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఇది జనవరి 22 వరకు కొనసాగుతుంది. ఈ ఈవెంట్ క్రౌన్ మెలోన్, వైట్/పింక్/రెడ్ స్ట్రాబెర్రీ, ఆర్గానిక్ అన్నో స్వీట్ పొటాటో, గ్రేప్స్, ఆపిల్, లెమన్, హరుకా రసం, డెకోపాన్ జ్యూస్తో సహా విభిన్న శ్రేణి జపనీస్ పండ్ల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. విదేశీ ఎగుమతులలో పెరుగుతున్న ట్రెండ్ ను ఆయన వివరించారు. జపాన్ ఫ్రూట్స్ రుచితో పాటు భద్రత ప్రమాణాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. జపనీస్ పండ్ల అధిక నాణ్యత కారణంగా వాటి ధరలు కాస్తా అధికంగా ఉంటాయన్నారు. జపాన్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ (J-FEC) చైర్మన్ యోషిహిసా హిషినుమా మాట్లాడుతూ.. ఇది దేశంలో ప్రారంభమైన జపనీస్ ఫ్రూట్స్ వీక్ ఈవెంట్ అని, ఖతార్కు అధిక నాణ్యత గల జపనీస్ పండ్లను పరిచయం చేయడం, వ్యాపార అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







