ఖతార్లో 'ఫ్రూట్స్ వీక్'ని ప్రారంభించిన జపాన్
- January 20, 2024
దోహా: జపాన్ వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ది-పెర్ల్ ఖతార్లోని జుంకో రెస్టారెంట్లో జపనీస్ ఫ్రూట్స్ వీక్ ప్రారంభం అయింది. ఖతార్లోని జపాన్ రాయబారి హెచ్ఈ సతోషి మేడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఇది జనవరి 22 వరకు కొనసాగుతుంది. ఈ ఈవెంట్ క్రౌన్ మెలోన్, వైట్/పింక్/రెడ్ స్ట్రాబెర్రీ, ఆర్గానిక్ అన్నో స్వీట్ పొటాటో, గ్రేప్స్, ఆపిల్, లెమన్, హరుకా రసం, డెకోపాన్ జ్యూస్తో సహా విభిన్న శ్రేణి జపనీస్ పండ్ల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. విదేశీ ఎగుమతులలో పెరుగుతున్న ట్రెండ్ ను ఆయన వివరించారు. జపాన్ ఫ్రూట్స్ రుచితో పాటు భద్రత ప్రమాణాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. జపనీస్ పండ్ల అధిక నాణ్యత కారణంగా వాటి ధరలు కాస్తా అధికంగా ఉంటాయన్నారు. జపాన్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ (J-FEC) చైర్మన్ యోషిహిసా హిషినుమా మాట్లాడుతూ.. ఇది దేశంలో ప్రారంభమైన జపనీస్ ఫ్రూట్స్ వీక్ ఈవెంట్ అని, ఖతార్కు అధిక నాణ్యత గల జపనీస్ పండ్లను పరిచయం చేయడం, వ్యాపార అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









