ఖతార్లో 'ఫ్రూట్స్ వీక్'ని ప్రారంభించిన జపాన్
- January 20, 2024
దోహా: జపాన్ వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ది-పెర్ల్ ఖతార్లోని జుంకో రెస్టారెంట్లో జపనీస్ ఫ్రూట్స్ వీక్ ప్రారంభం అయింది. ఖతార్లోని జపాన్ రాయబారి హెచ్ఈ సతోషి మేడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఇది జనవరి 22 వరకు కొనసాగుతుంది. ఈ ఈవెంట్ క్రౌన్ మెలోన్, వైట్/పింక్/రెడ్ స్ట్రాబెర్రీ, ఆర్గానిక్ అన్నో స్వీట్ పొటాటో, గ్రేప్స్, ఆపిల్, లెమన్, హరుకా రసం, డెకోపాన్ జ్యూస్తో సహా విభిన్న శ్రేణి జపనీస్ పండ్ల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. విదేశీ ఎగుమతులలో పెరుగుతున్న ట్రెండ్ ను ఆయన వివరించారు. జపాన్ ఫ్రూట్స్ రుచితో పాటు భద్రత ప్రమాణాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. జపనీస్ పండ్ల అధిక నాణ్యత కారణంగా వాటి ధరలు కాస్తా అధికంగా ఉంటాయన్నారు. జపాన్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ (J-FEC) చైర్మన్ యోషిహిసా హిషినుమా మాట్లాడుతూ.. ఇది దేశంలో ప్రారంభమైన జపనీస్ ఫ్రూట్స్ వీక్ ఈవెంట్ అని, ఖతార్కు అధిక నాణ్యత గల జపనీస్ పండ్లను పరిచయం చేయడం, వ్యాపార అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు