ఖతార్లో 'ఫ్రూట్స్ వీక్'ని ప్రారంభించిన జపాన్
- January 20, 2024
దోహా: జపాన్ వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ది-పెర్ల్ ఖతార్లోని జుంకో రెస్టారెంట్లో జపనీస్ ఫ్రూట్స్ వీక్ ప్రారంభం అయింది. ఖతార్లోని జపాన్ రాయబారి హెచ్ఈ సతోషి మేడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఇది జనవరి 22 వరకు కొనసాగుతుంది. ఈ ఈవెంట్ క్రౌన్ మెలోన్, వైట్/పింక్/రెడ్ స్ట్రాబెర్రీ, ఆర్గానిక్ అన్నో స్వీట్ పొటాటో, గ్రేప్స్, ఆపిల్, లెమన్, హరుకా రసం, డెకోపాన్ జ్యూస్తో సహా విభిన్న శ్రేణి జపనీస్ పండ్ల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. విదేశీ ఎగుమతులలో పెరుగుతున్న ట్రెండ్ ను ఆయన వివరించారు. జపాన్ ఫ్రూట్స్ రుచితో పాటు భద్రత ప్రమాణాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. జపనీస్ పండ్ల అధిక నాణ్యత కారణంగా వాటి ధరలు కాస్తా అధికంగా ఉంటాయన్నారు. జపాన్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ (J-FEC) చైర్మన్ యోషిహిసా హిషినుమా మాట్లాడుతూ.. ఇది దేశంలో ప్రారంభమైన జపనీస్ ఫ్రూట్స్ వీక్ ఈవెంట్ అని, ఖతార్కు అధిక నాణ్యత గల జపనీస్ పండ్లను పరిచయం చేయడం, వ్యాపార అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







