4 ఏళ్ళ కూతుర్ని చంపి, ఫ్రిజ్లో దాచిన కసాయి
- May 31, 2016
కువైట్కి చెందిన ఓ వ్యక్తి తన 4 ఏళ్ళ కుమార్తెను అతి కిరాతకంగా చంపి, ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్లో దాచిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కువైట్ సిటీలోని సల్మియా ప్రాంతంలో జరిగిన ఈ హత్యకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో, రంగంలోకి దిగిన పోలీసు అధికారుల బృందం విచారణను చేపట్టింది. సలెమ్ బౌహన్ అనే 26 ఏళ్ళ వ్యక్తి, తన కుమార్తె ఇస్రాని ఎలక్ట్రికల్ వైర్తో దారుణంగా కొట్టాడు, అనంతరం ఆమెపై వేడి నీళ్ళు పోశాడు. ఇదంతా ఆమె తల్లి చూస్తుండగానే జరిగింది. ఫోరెన్సిక్ వైద్యులు పసిపాపను అతి కిరాతకంగా హింసించిన దాఖలాలున్నాయని తెలిపారు. విచారణలో నిందితుడు, డ్రగ్ ఎడిక్ట్గా తేలింది. తాను వాడే డ్రగ్ పిల్ని తీసుకోవడం ద్వారా పాప చనిపోయిందని పోలీసులకు తొలుత నిందితుడు చెప్పాడు. ఆ తర్వాత అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇంట్లో తాను చెప్పినమాట వినలేదన్న కోపంతో ఆ పాపని కొట్టాననీ, ఆ తర్వాత ఆమె ఒంటిపై గాయాలు చూసి, మందులు తీసుకొచ్చి ఆమెకు రాయాలనుకున్నాననీ అప్పటికే ఆ పాప చనిపోయిందని వివరించాడు నిందితుడు తన నేరాన్ని. పాప చనిపోయిందని తెలుసుకున్నాక మార్కెట్కి వవెళ్ళి ఫ్రీజర్ కొనుక్కొచ్చి, అందులో ఆ పాపని ఉంచాడు. ఆ ఇంట్లో ఉండటానికి మృతురాలి తల్లి అంగీకరించకపోవడంతో, ఆమెతోపాటు మరో ముగ్గురు పిల్లల్ని వేరే ఫ్లాట్కి మార్చాడు నిందితుడు. పాపను చంపిన తండ్రితోపాటు, ఆ సమయంలో అక్కడే ఉన్న మృతురాలి తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పాప తల్లితండ్రులిద్దరూ డ్రగ్స్ సేవించేవారని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







