ఓల్డ్ దోహా పోర్ట్లో ఆకట్టుకుంటున్న 'మానవ హక్కులు, ఫుట్బాల్' ఎగ్జిబిషన్
- January 31, 2024
దోహా: జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC) మానవ హక్కుల సూత్రాలపై అవగాహన పెంపొందించే ఫ్రేమ్వర్క్లో భాగంగా ఓల్డ్ దోహా పోర్ట్లో 'మానవ హక్కులు మరియు ఫుట్బాల్' ప్రదర్శనను ప్రారంభించింది. AFC ఆసియన్ కప్ ఖతార్ 2023తో పాటు ఈ ఈవెంట్ ను ప్రారంభించారు. పౌరులు, నివాసితులు మరియు ఫుట్బాల్ అభిమానులను ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. మానవ హక్కుల సంస్కృతిని మరింత లోతుగా తెలుసుకునేందుకు ఈ ప్రదర్శన దోహదం చేస్తుందని ప్రారంభోత్సవ సమయంలో NHRC చైర్పర్సన్ హెచ్ఇ మర్యం బింట్ అబ్దుల్లా అల్ అత్తియా అన్నారు. ఖతారీ కళాకారుడు అహ్మద్ అల్ మదీద్ చిత్రీకరించిన పెయింటింగ్ లను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 టోర్నమెంట్ సందర్భంగా మొదటిసారిగా ఎగ్జిబిషన్ ప్రారంభించబడిందని, జెనీవాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభించి ప్రపంచంలోని అనేక రాజధానులను విజయవంతంగా అధిగమించిందని మరియు సాధ్యమైనంత విస్తృతంగా అవగాహనను వ్యాప్తి చేయడంలో విజయవంతం అయిందని వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







