సౌదీ అరేబియాలో కాన్సుల్ జనరల్గా తెలుగు దౌత్యవేత్త నియామకం
- January 31, 2024జెద్దా: జెద్దాలో భారత కాన్సుల్ జనరల్గా తెలుగు యువ దౌత్యవేత్త ఫహాద్ అహ్మద్ సూరీ నియమితులయ్యారు. 2014 బ్యాచ్కు చెందిన ఫహాద్ అహ్మద్ సూరీ ప్రస్తుతం వాణిజ్య మంత్రిత్వ శాఖలో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రీకా దేశాలతో భారత ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. అంతకు ముందు ఆయన కువైట్ లోని భారతీయ ఎంబసీలో పనిచేసారు. కరోనా సంక్షోభంలో మిషన్ వందే భారత్లో ఆయన కీలక పాత్ర పోషించారు.
కర్నూలు నగరంలోని ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన ఫహాద్ స్థానిక జి.పుల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో చదివారు.ఆ తర్వాత బెంగుళూరులో ఎంబీఏ చేసి లండన్లో బ్యాంకర్గా పని చేసిన అనంతరం సివిల్స్ పరిక్షలో I.F.Sకు ఎంపికయ్యారు.రాజకీయ, సైనిక, లక్షలాది మంది హాజ్ యాత్రికుల రాకపోకల దృష్ట్యా జెద్దాలోని కాన్సుల్ జనరల్ పోస్టింగ్కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటి వరకు జెద్దాలో పని చేసిన షాహీద్ ఆలంను లండన్లోని భారతీయ హైకమీషన్కు బదిలీ చేసారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- బార్కాలో కార్మికుల వసతికి ‘అల్ మస్కాన్ విలేజ్’
- దుబాయ్లో చిన్న ఫ్లాట్లకు పెరుగుతున్న డిమాండ్..!