చిలీలో ఆగని కార్చిచ్చు–46 మంది మృతి..!
- February 04, 2024
చిలీ: దక్షిణ అమెరికాలో చెలరేగిన కార్చిచ్చుకు ఇప్పటికి 46 మంది మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ కార్చిచ్చు ఆగడం లేదు. గతేడాది కంటే తక్కువ విస్తీర్ణంలో కార్చిచ్చు చెలరేగినా.. ప్రాణ నష్టం మాత్రం అధికంగా ఉంది. వేసవి వచ్చిందంటే చాలు.. అమెరికా, ఐరోపా ఖండాల్లోని అడవుల్లో కార్చిచ్చు చెలరేగి లక్షలాది ఎకరాలు కాలిబూడిదవుతున్నాయి. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు.
అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ శనివారం మాట్లాడుతూ … ఈ కార్చిచ్చులో ఇప్పటివరకు 46 మంది మృతిచెందినట్లు తెలిపారు. వేలాది మంది గాయపడినట్లు చెప్పారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలిబూడిదైనట్లు వివరించారు. సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్ విజ్ఞప్తి చేశారు. మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని.. వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్లు మంత్రి కరోలినా వెల్లడించారు. మంటల తీవ్రత అధికంగా ఉన్న వాల్పరైజో ప్రాంతం నుంచి ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.
ప్రస్తుతం చిలీ వ్యాప్తంగా 92 ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగగా.. 43 వేల హెక్టార్లలో అడవులు ప్రభావితమైనట్టు మంత్రి కరోలినా చెప్పారు. ఇక, తీరప్రాంత పర్యాటక నగరం వినాడెల్ మార్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, కార్చిచ్చు ప్రాంతాలకు చేరుకోవడం రెస్క్యూ సిబ్బందికి కష్టంగా మారిందని అధికారులు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశంలో చెలరేగిన కార్చిచ్చుల్లో అత్యంత దారుణమైనది ఇదేనని చిలీ డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది. ఇక, చిలీలో కార్చిచ్చు సర్వసాధారణం. గతేడాది అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 4 లక్షల హెక్టార్ల మేర అడవులు దగ్ధమయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాదితో పోల్చితే ఇది తక్కువ విస్తీర్ణమైనా.. ప్రాణనష్టం అధికంగా ఉంది.
తాజా వార్తలు
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!







