2023లో 44 శాతం పెరిగిన జర్నలిస్టుల మరణాలు..!
- February 17, 2024
బహ్రెయిన్ : 2023లో మరణించిన 99 మంది జర్నలిస్టులలో డెబ్బై రెండు మంది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరణించారని జర్నలిస్టుల రక్షణ కమిటీ(CPJ) తెలిపింది. గాజా, ఇజ్రాయెల్ మరియు లెబనాన్లలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. 2015 నుండి మరణాల సంఖ్య పెరుగుతుందని, 2022 గణాంకాలతో పోల్చుకుంటే దాదాపు 44 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపింది. పాలస్తీనాలో నమోదైన జర్నలిస్టుల మరణాలుజర్నలిజంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని CPJ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోడీ గిన్స్బర్గ్ అన్నారు. ఫిలిప్పీన్స్, సోమాలియాతో పాటు మెక్సికో ప్రపంచంలో పత్రికా రంగానికి అత్యంత ఘోరమైన దేశాలలో ఒకటి అని CPJ వెల్లడించింది. హింస కారణంగా చాలామంది తమ జర్నలిజాన్ని విడిచిపెడుతున్నట్లు CPJ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









