2023లో 44 శాతం పెరిగిన జర్నలిస్టుల మరణాలు..!

- February 17, 2024 , by Maagulf
2023లో 44 శాతం పెరిగిన జర్నలిస్టుల మరణాలు..!

బహ్రెయిన్ : 2023లో మరణించిన 99 మంది జర్నలిస్టులలో డెబ్బై రెండు మంది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరణించారని జర్నలిస్టుల రక్షణ కమిటీ(CPJ) తెలిపింది. గాజా, ఇజ్రాయెల్ మరియు లెబనాన్‌లలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.  2015 నుండి మరణాల సంఖ్య పెరుగుతుందని, 2022 గణాంకాలతో పోల్చుకుంటే దాదాపు 44 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపింది.  పాలస్తీనాలో నమోదైన జర్నలిస్టుల మరణాలుజర్నలిజంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని CPJ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోడీ గిన్స్‌బర్గ్ అన్నారు.   ఫిలిప్పీన్స్, సోమాలియాతో పాటు మెక్సికో ప్రపంచంలో పత్రికా రంగానికి అత్యంత ఘోరమైన దేశాలలో ఒకటి అని CPJ వెల్లడించింది. హింస కారణంగా చాలామంది తమ జర్నలిజాన్ని విడిచిపెడుతున్నట్లు CPJ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com