తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు మూడు రోజులు సెలవులు
- March 07, 2024
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపట్నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి, 9న రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు 2వ శనివారం సెలవు ఉండదు. అలాగే మార్చి 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. మొత్తం గా ఈ నెలలో ఎక్కువ రోజులే స్కూల్స్ కు సెలవులు వచ్చాయి.
రేపు శివ రాత్రి సందర్బంగా దేశ వ్యాప్తంగా ఆలయాలు ముస్తాబు అయ్యాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. ఆ రోజు కోసం శివ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇక ఈ ఏడాది శివరాత్రి మార్చి 8న వచ్చింది. ఆ రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తర్వాత చతుర్దశి ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి మార్చి 9న సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది. శుక్రవారం లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండటంతో 8న మహాశివరాత్రిని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







