తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు మూడు రోజులు సెలవులు
- March 07, 2024
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపట్నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి, 9న రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు 2వ శనివారం సెలవు ఉండదు. అలాగే మార్చి 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. మొత్తం గా ఈ నెలలో ఎక్కువ రోజులే స్కూల్స్ కు సెలవులు వచ్చాయి.
రేపు శివ రాత్రి సందర్బంగా దేశ వ్యాప్తంగా ఆలయాలు ముస్తాబు అయ్యాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. ఆ రోజు కోసం శివ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇక ఈ ఏడాది శివరాత్రి మార్చి 8న వచ్చింది. ఆ రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తర్వాత చతుర్దశి ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి మార్చి 9న సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది. శుక్రవారం లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండటంతో 8న మహాశివరాత్రిని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







