తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు మూడు రోజులు సెలవులు
- March 07, 2024
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపట్నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి, 9న రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు 2వ శనివారం సెలవు ఉండదు. అలాగే మార్చి 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. మొత్తం గా ఈ నెలలో ఎక్కువ రోజులే స్కూల్స్ కు సెలవులు వచ్చాయి.
రేపు శివ రాత్రి సందర్బంగా దేశ వ్యాప్తంగా ఆలయాలు ముస్తాబు అయ్యాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. ఆ రోజు కోసం శివ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇక ఈ ఏడాది శివరాత్రి మార్చి 8న వచ్చింది. ఆ రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తర్వాత చతుర్దశి ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి మార్చి 9న సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది. శుక్రవారం లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండటంతో 8న మహాశివరాత్రిని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









