సన్ రైజర్స్ కొత్త జెర్సీ !
- March 08, 2024
హైదరాబాద్: ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే, కొత్త ప్లేయర్స్ తో బలంగా ఉంది.
ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్ ను కెప్టెన్ గా తొలగించి, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టులోనూ భారీగా మార్పులు చేపట్టింది. మరోవైపు.. ఈరోజు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది.
ఆరెంజ్ కలర్ ను మిస్ కాకుండా వాటిపై నల్లని చారలను జిగ్ జాగ్ గా ప్రింట్ చేసిన జెర్సీలను సన్ రైజర్స్ తన ఆటగాళ్లకు అందించింది. అయితే.. హైదరాబాద్ చేరుకున్న సన్ రైజర్స్ ఆటగాళ్లు సరికొత్త జెర్సీలతో ఫొటో షూట్ కు హాజరయ్యారు. కొత్త జెర్సీతో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫోటోలకు ఫోజులిచ్చాడు. కొత్త జెర్సీ విషయాన్ని రివీల్ చేస్తూ భువీ ఫోటోనే సన్రైజర్స్ మేనేజ్మెంట్ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. హైదరాబాద్ వేడిని బయటపెట్టడానికి సిద్దం.. ఐపీఎల్ 2024 కోసం మా జ్వలించే కవచం అంటూ క్యాప్షన్లు జోడించింది.
ఈ జెర్సీ సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకో తెలుసా.. దక్షిణాఫ్రికాలో గత రెండు సీజన్లుగా ఎస్ఏ టీ20 లీగ్ ను సన్ రైజర్స్ గెలిచింది. ఐడెన్ మార్క్రమ్ నాయకత్వంలోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వరుసగా 2023, 2024 సీజన్లలో చాంపియన్ గా నిలిచింది. ఆ టోర్నీలో ఏ డిజైన్ జెర్సీలు వాడారో, ఇప్పుడు ఐపీఎల్ లోనూ సన్ రైజర్స్ ఆటగాళ్లకు అదే డిజైన్ తో ఉన్న జెర్సీలు అందించారు. కలిసొచ్చిన జెర్సీతో అయినా ఐపీఎల్ లో తమ భాగ్యరేఖ మారుతుందేమోనని సన్ రైజర్స్ యాజమాన్యం ఆశిస్తోంది. రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ఆరెంజ్ ఆర్మీ ఇదివరకే సన్నాహకాలను మొదలుపెట్టింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ను షురూ చేసింది. మిగిలిన ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్కు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ తొలి మ్యాచ్ను మార్చి 23న కేకేఆర్తో ఆడనుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు