ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన స్వామి బ్రహ్మవిహారిదాస్
- March 15, 2024న్యూఢిల్లీ: BAPS స్వామినారాయణ్ సంస్థ తరపున స్వామి బ్రహ్మవిహారిదాస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సంధర్భంగా పవిత్ర మహంత్ స్వామి మహారాజ్ ప్రత్యేకంగా ఆశీర్వదించిన ఒక హారాన్ని ప్రధానమంత్రికి అందించారు. అబుదాబి BAPS హిందూ మందిర్ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు దానిని పర్యవేక్షించినందుకు స్వామి బ్రహ్మవిహారిదాస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మందిరానికి సంబంధించిన సంక్షిప్త నివేదికను అందించారు. యూఏఈ కమ్యూనిటీ మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన సందర్శకులు ఈ మందిర్ను చూసేందుకు వస్తున్నారని, మొదటి ఆదివారం 65,000 మంది సందర్శకులు వచ్చారని వివరించారు. మహా శివరాత్రి వంటి పండుగలను జరుపుకోవడానికి ఇది వేదికగా ఉందని, అటువంటి ఉత్సాహభరితమైన పండుగలు, ఆచారాలు మరియు సంప్రదాయాలను కొనసాగించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని యూఏఈ పాలకుల విశాల హృదయం మరియు మద్దతు కోసం కృతజ్ఞతలు తెలియజేశారు.అబుదాబిలోని BAPS హిందూ మందిర్ను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న స్వామీజీలు, వాలంటీర్లను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర