ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన స్వామి బ్రహ్మవిహారిదాస్
- March 15, 2024
న్యూఢిల్లీ: BAPS స్వామినారాయణ్ సంస్థ తరపున స్వామి బ్రహ్మవిహారిదాస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సంధర్భంగా పవిత్ర మహంత్ స్వామి మహారాజ్ ప్రత్యేకంగా ఆశీర్వదించిన ఒక హారాన్ని ప్రధానమంత్రికి అందించారు. అబుదాబి BAPS హిందూ మందిర్ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు దానిని పర్యవేక్షించినందుకు స్వామి బ్రహ్మవిహారిదాస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మందిరానికి సంబంధించిన సంక్షిప్త నివేదికను అందించారు. యూఏఈ కమ్యూనిటీ మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన సందర్శకులు ఈ మందిర్ను చూసేందుకు వస్తున్నారని, మొదటి ఆదివారం 65,000 మంది సందర్శకులు వచ్చారని వివరించారు. మహా శివరాత్రి వంటి పండుగలను జరుపుకోవడానికి ఇది వేదికగా ఉందని, అటువంటి ఉత్సాహభరితమైన పండుగలు, ఆచారాలు మరియు సంప్రదాయాలను కొనసాగించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని యూఏఈ పాలకుల విశాల హృదయం మరియు మద్దతు కోసం కృతజ్ఞతలు తెలియజేశారు.అబుదాబిలోని BAPS హిందూ మందిర్ను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న స్వామీజీలు, వాలంటీర్లను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







