ధోఫర్ లో ఆటం సీజన్ పర్యాటకం ప్రారంభం
- March 16, 2024
మస్కట్: ధోఫర్ లో ఆటం సీజన్ పర్యాటకం ప్రారంభమైంది. 2023 ఆటం సీజన్లో ధోఫర్ గవర్నరేట్లో పర్యాటక ప్రవాహం వృద్ధి రేటు 18.4%కి చేరుకుంది. సలాలా విమానాశ్రయానికి వింటర్ సీజన్లో చార్టర్ విమానాల సంఖ్య 239 డైరెక్ట్ ఫ్లైట్లకు చేరుకుంది. వింటర్ సీజన్లో 5 మరియు 4 నక్షత్రాల కేటగిరీల హోటల్ ఆక్యుపెన్సీ రేటు 95% కంటే ఎక్కువగా పెరిగిందని దోఫర్ గవర్నరేట్లోని హెరిటేజ్ అండ్ టూరిజం డైరెక్టర్ జనరల్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ అబ్రి తెలిపారు. దోఫర్ గవర్నరేట్లోని వివిధ ప్రదేశాలలో అనేక పర్యాటక ప్రాజెక్టులు పూర్తియినట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మౌంట్ సమ్హాన్లోని “హేవార్” గుహ ప్రత్యేకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత ఈ సంవత్సరమే సదా కోటను సందర్శకుల కోసం ప్రారంభిస్తామని, అలాగే ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా పెట్టుబడి సంస్థ రఖ్యూత్ కోటను ప్రారంభించనున్నట్లు అల్-అబ్రి వివరించారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









