ధోఫర్ లో ఆటం సీజన్ పర్యాటకం ప్రారంభం
- March 16, 2024
మస్కట్: ధోఫర్ లో ఆటం సీజన్ పర్యాటకం ప్రారంభమైంది. 2023 ఆటం సీజన్లో ధోఫర్ గవర్నరేట్లో పర్యాటక ప్రవాహం వృద్ధి రేటు 18.4%కి చేరుకుంది. సలాలా విమానాశ్రయానికి వింటర్ సీజన్లో చార్టర్ విమానాల సంఖ్య 239 డైరెక్ట్ ఫ్లైట్లకు చేరుకుంది. వింటర్ సీజన్లో 5 మరియు 4 నక్షత్రాల కేటగిరీల హోటల్ ఆక్యుపెన్సీ రేటు 95% కంటే ఎక్కువగా పెరిగిందని దోఫర్ గవర్నరేట్లోని హెరిటేజ్ అండ్ టూరిజం డైరెక్టర్ జనరల్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ అబ్రి తెలిపారు. దోఫర్ గవర్నరేట్లోని వివిధ ప్రదేశాలలో అనేక పర్యాటక ప్రాజెక్టులు పూర్తియినట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మౌంట్ సమ్హాన్లోని “హేవార్” గుహ ప్రత్యేకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత ఈ సంవత్సరమే సదా కోటను సందర్శకుల కోసం ప్రారంభిస్తామని, అలాగే ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా పెట్టుబడి సంస్థ రఖ్యూత్ కోటను ప్రారంభించనున్నట్లు అల్-అబ్రి వివరించారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









