ధోఫర్ లో ఆటం సీజన్ పర్యాటకం ప్రారంభం
- March 16, 2024
మస్కట్: ధోఫర్ లో ఆటం సీజన్ పర్యాటకం ప్రారంభమైంది. 2023 ఆటం సీజన్లో ధోఫర్ గవర్నరేట్లో పర్యాటక ప్రవాహం వృద్ధి రేటు 18.4%కి చేరుకుంది. సలాలా విమానాశ్రయానికి వింటర్ సీజన్లో చార్టర్ విమానాల సంఖ్య 239 డైరెక్ట్ ఫ్లైట్లకు చేరుకుంది. వింటర్ సీజన్లో 5 మరియు 4 నక్షత్రాల కేటగిరీల హోటల్ ఆక్యుపెన్సీ రేటు 95% కంటే ఎక్కువగా పెరిగిందని దోఫర్ గవర్నరేట్లోని హెరిటేజ్ అండ్ టూరిజం డైరెక్టర్ జనరల్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ అబ్రి తెలిపారు. దోఫర్ గవర్నరేట్లోని వివిధ ప్రదేశాలలో అనేక పర్యాటక ప్రాజెక్టులు పూర్తియినట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మౌంట్ సమ్హాన్లోని “హేవార్” గుహ ప్రత్యేకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత ఈ సంవత్సరమే సదా కోటను సందర్శకుల కోసం ప్రారంభిస్తామని, అలాగే ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా పెట్టుబడి సంస్థ రఖ్యూత్ కోటను ప్రారంభించనున్నట్లు అల్-అబ్రి వివరించారు.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







