జక్కన్న సరదాగా దుబాయ్ లో
- June 04, 2016
జక్కన్న సరదాగా తనకు నచ్చిన అమ్మాయితో దుబాయ్ అంతా చుట్టేశాడు. అక్కడి వీధుల్లో తన అందాల రాశితో ఎంచక్కా డ్యూయెట్లు పాడేసుకున్నాడు. వీరిద్దరి ఆటాపాటల సందడేంటో తెలియాలంటే 'జక్కన్న' చూడాల్సిందే అంటున్నారు చిత్ర దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. సునీల్, మన్నార్ చోప్రా జంటగా ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్రెడ్డి నిర్మించిన చిత్రం 'జక్కన్న'. ఈ చిత్రం కోసం ఇటీవల దుబాయ్లో ఓ పాట చిత్రీకరించారు.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ''ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఊహించని ట్విస్టులతో ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.
ఈ నెలలోనే పాటలను, జూలైలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: దినేశ్, సినిమాటోగ్రఫీ: రామ్ప్రసాద్, సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







