ఐపిఎల్ వేడుకలు అదుర్స్
- March 22, 2024
చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)-2024 ఆరంభ వేడుకలు ఎంఎ చిదంబరం(చెపాక్) స్టేడియంలో శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ప్రారంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ చేసిన ప్రదర్శలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. తొలుత జాతీయ జెండాతో అక్షరు కుమార్ గ్రాండ్ ఎంట్రీతో ఈ వేడుకలు మొదలయ్యాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ పాడిన ‘మా తుఝే సలామ్’ పాటకు గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకులంతా స్వరం కలుపగా.. సింగర్ సోనూ నిగమ్ పాడిన దేశభక్తి పాటలు అభిమానులను ఉత్సాహరిచారు. అనంతరం వేదికపైకి చెన్నై నూతన సారథి రుతురాజ్ గైక్వాడ్ ఐపిఎల్ సీజన్-17 ట్రోఫీని తీసుకొచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ డుప్లెసిస్, బిసిసిఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా, లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుపాల్, ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..







