శ్రీలంకలో జరిగిన సిబిఎస్ఇ గల్ఫ్ సహోదయ ప్రిన్సిపాల్స్ కాన్ఫరెన్స్
- March 23, 2024
కువైట్: కువైట్ చాప్టర్ 36వ CBSE గల్ఫ్ సహోద్యాయ ప్రిన్సిపాల్స్ కాన్ఫరెన్స్ని శ్రీలంకలోని కొలంబోలోని హిల్టన్ హోటల్లో ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 10 వరకు నిర్వహించింది. 'విజనరీ లీడర్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఛేంజేస్' పేరిట కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. 1986లో స్థాపించబడిన CBSE గల్ఫ్ సహోదయ, ఆరు మధ్య ప్రాచ్య దేశాల నుండి 200 మంది ప్రిన్సిపాల్లు సభ్యులుగా ఉన్నారు. ప్రారంభోత్సవ వేడుకకు శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్ధనేనతోపాటు మధ్యప్రాచ్యంలోని ప్రతిష్టాత్మక CBSE పాఠశాలల నుండి విశిష్ట అతిథులు, గౌరవనీయ వక్తలు, ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు. కువైట్లోని భారత డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ సత్యంజల్ పాండే ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా CBSE Gulf Sahodaya మొబైల్ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. ఇండియన్ మెంటలిస్ట్, మెజీషియన్ మరియు యూట్యూబర్ మాస్టర్ ఆనందు అందించిన వినోద విభాగం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భారతీయ హాస్యనటుడు అలీ అస్గర్ హాస్య ప్రదర్శన , స్టీఫెన్ దేవస్సీచే సంగీత కాన్సర్ట్ కూడా ఆకట్టుకున్నాయి. ముగింపు కార్యక్రమానికి శ్రీలంక ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర మంత్రి సురేన్ రాఘవన్ హాజరయ్యారు. గల్ఫ్ టాపర్స్, చాప్టర్ టాపర్స్, నేషనల్, స్పోర్ట్స్ అచీవర్స్ కు అవార్డు ప్రదానోత్సవం జరిగింది. కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్కు చెందిన అబిదా రఫిక్ చిక్తే మరియు కువైట్లోని ఇండియన్ ఎడ్యుకేషనల్ స్కూల్కు చెందిన ఫిదా ఆన్సి పదో తరగతి సిబిఎస్ఇ బోర్డు పరీక్షలో 500 మార్కులకు 497 మార్కులు సాధించి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సైన్స్ స్ట్రీమ్ XII తరగతి నుండి, ఇండియన్ కమ్యూనిటీ స్కూల్, కువైట్ నుండి తాహా రఫిక్ చిక్తే 500 కి 495 మార్కులతో మూడవ స్థానం పొందారు. కామర్స్ స్ట్రీమ్ నుండి, ది ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ నుండి సకీనా, కువైట్ 500 మార్కులకు 489 మార్కులతో రెండవ స్థానంలో నిలిచింది. కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్కు చెందిన హ్యుమానిటీస్ స్ట్రీమ్ నుండి ఐరీన్ మేరీ కురువిల్లా 500 మార్కులకు 494 మార్కులతో మొదటి స్థానంలో నిలిచి అవార్డులను అందుకున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







