యూఏఈ దిర్హామ్తో రికార్డు స్థాయికి పడిపోయిన ఇండియన్ రూపీ
- March 23, 2024
యూఏఈ: భారతీయ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్ మరియు యూఏఈ దిర్హామ్తో పోలిస్తే రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ డిమాండ్ కారణంగా రూపీ విలువ తగ్గిందని వ్యాపారులు తెలిపారు. యూఏఈ దిర్హామ్తో రూపాయి ఇంట్రా-డే కనిష్ట స్థాయికి 22.732కి పడిపోయింది. సెషన్ ముగిసే సమయానికి బలమైన డాలర్ బిడ్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం (ఆర్బిఐ) చేసుకోకపోవడంతో రూపాయి విలువ రికార్డు స్థాయికి నెట్టివేసిందని ఒక ప్రైవేట్ బ్యాంక్లోని విదేశీ మారకపు వ్యాపారి చెప్పారు. రూపాయిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్బీఐ అంతకుముందు సెషన్లో 83.38-83.39 స్థాయిలకు దగ్గరగా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని ట్రేడర్లు అంచనా వేశారు. కానీ చివరి నిమిషంలో ఆర్బీఐ వెనక్కు తగ్గిందని ట్రేడర్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









