బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ పొడిగింపు
- March 23, 2024
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో కవితను అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వారం రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు, మరో మూడు రోజులు పొడిగించింది.
కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది, మరికొందరితో కలిపి కవితను ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. కవిత కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు వెల్లడించలేదని చెప్పారు. కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని ఈడీ తెలిపింది. మద్యం కేసులో సమీర్ మహేంద్రును విచారించాల్సి ఉందన్న ఈడీ, మేకా శరణ్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని వెల్లడించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









