బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ పొడిగింపు

- March 23, 2024 , by Maagulf
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో కవితను అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వారం రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు, మరో మూడు రోజులు పొడిగించింది.

కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది, మరికొందరితో కలిపి కవితను ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. కవిత కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు వెల్లడించలేదని చెప్పారు. కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని ఈడీ తెలిపింది. మద్యం కేసులో సమీర్ మహేంద్రును విచారించాల్సి ఉందన్న ఈడీ, మేకా శరణ్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com